Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అనుష్క కారణంగా చిక్కులో పడిన రష్మిక మందన్న.. ఓ రేంజ్ ట్రోల్స్.. ఇదీ జరిగింది
క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న పై మరోసారి భగ్గుమంటున్నారు నెటిజన్లు. నటీనటులకు ట్రోల్స్ భారిన పడటం మామూలు విషయమే అయినప్పటికీ.. రష్మిక ట్రోల్స్ బారిన పడటానికి పరోక్షంగా కారణం అనుష్క కావడం ఇక్కడ ఆసక్తికర అంశం. ఇంతకీ రష్మిక ట్రోల్స్ విషయంలో అనుష్క ఎందుకు కారణమైంది. అసలు జరిగిందేంటి? వివరాల్లోకి పోతే..
అనుష్క మెసేజ్.. కన్నడికుల రెస్పాన్స్
ఇటీవలే తన కుటుంబ సభ్యులతో దిగిన ఓ పిక్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అనుష్క.. ఈ పిక్ ద్వారా తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. అయితే ఈ విష్ ఏ ఇతర భాషలో కాకుండా తన మదర్ టంగ్ కన్నడలోనే చేసింది స్వీటీ అనుష్క. దీంతో ఈ పోస్ట్ చూసి మురిసిపోయిన కన్నడికులు మరోసారి రష్మికను టార్గెట్ చేశారు.
రష్మికను టార్గెట్ చేసిన కన్నడికులు
బేసికల్గా కన్నడ భామ అయిన రష్మిక మందన్న ఇటీవల జరిగిన డియర్ కామ్రేడ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో తనకు కన్నడ పెద్దగా రాదని చెప్పింది. కన్నడలో డబ్బింగ్ చెప్పడం కూడా తనకు కష్టమైందని చెప్పింది. దీంతో ఆ సమయంలో కన్నడికులు రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
అనుష్క పోస్ట్ చూసి మరోసారి
స్టార్ హీరోయిన్ అనుష్క కూడా కన్నడియన్, పైగా ఆమె మాతృ భాష పట్ల ఉన్న అభిమానంతో ఇలా తన తల్లికి కన్నడలో విష్ చేయడం స్వాగతించారు కన్నడ జనం. మరోవైపు అనుష్క పెట్టిన ఈ పోస్ట్ చూడగానే రష్మిక పై విరుచుకుపడుతూ పెద్ద ఎత్తున ట్రోల్స్ ప్రారంభించారు. స్టార్ హీరోయిన్ అయిన అనుష్కనైనా చూసి నేర్చుకో.. అంటూ రష్మిక పై పడ్డారు నెటిజన్లు.
రష్మిక.. డియర్ కామ్రేడ్
టాలీవుడ్ క్రేజీ జోడీ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ సినిమా తెరకెక్కింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితం రాబట్టలేక పోయింది. కానీ హీరోహీరోయిన్లు విజయ్, రష్మిక నటనలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
రష్మిక మందన్న అప్కమింగ్ మూవీ
ట్రోల్స్ సంగతి పక్కన బెడితే టాలీవుడ్ లో రష్మిక మందన్న జోష్ కొనసాగుతోంది. అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం పట్టేసిన ఆమె.. ప్రస్తుతం మహేష్ బాబు సరసన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో, నితిన్ సరసన ఓ సినిమాలో అలాగే అల్లు అర్జున్ సరసన మరో సినిమాలో నటిస్తోంది.