Don't Miss!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Sports IPL 2024: హార్దిక్.. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమనేది!వీడియో
- News YS Jagan పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్ చేయాలని ఉంది.. క్లారిటీ ఇచ్చిన రవితేజ
మాస్ మహరాజా రవితేజ చాలా కాలం తరువాత క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది సమ్మర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఆపసోపాలు పడి థియేటర్స్ లోకి వచ్చింది. ఆలస్యం చేసినా ఇబ్బందుకు ఎదురైనా కూడా సినిమా ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటోంది. అయితే చాలా కాలం తరువాత రవితేజ సీక్వెల్ చెయబోయే సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు.
మాస్ రాజా తన కెరీర్ లో మొదటి సారి కిక్ సినిమాకు మాత్రమే డిఫరెంట్ గా సీక్వెల్ ను ట్రై చేసిన విషయం తెలిసిందే. కిక్ 2 డిజాస్టర్ కావడంతో మళ్ళీ అలాంటి ప్రయోగం చేయలేదు. ఇక చాలా రోజుల తరువాత క్రాక్ సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని ఉందని చెప్పాడు. అంతే కాకుండా రాజా ది గ్రేట్ సినిమాకు కూడా సీక్వెల్ చేయాలని ఉందని అన్నాడు. ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి కూడా తప్పకుండా రాజా ది గ్రేట్ సీక్వెల్ ఉంటుందని చెప్పాడు.
క్రాక్ సినిమాను గోపీచంద్ మాలినేనీ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీస్ పాత్రలో కనిపించి మాస్ రాజా సెంటిమెంట్ హిట్ కొట్టాడు. గతంలో చాలా సినిమాల్లో పోలీస్ గా చేసి మాస్ రాజా సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక దర్శకుడు గోపిచంద్ మంచి కమర్షియల్ డైరెక్టర్ గా మరోసారి తన సత్తాను నితుపించుకున్నాడు. మరి క్రాక్ 2 ఆయన ఎప్పుడు సెట్స్ పైకి తెస్తాడో చూడాలి.