Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
పూరీపై అభిమానంతో రవితేజ గెస్ట్ రోల్
హైదరాబాద్: రవితేజ త్వరలో ఓ గెస్ట్ రోల్ లో కనిపించి మురిపించనున్నారు. పూరీ జగన్నాధ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నటిస్తున్న 'రోమియో'లో రవితేజ కనిపిస్తాడు. సినిమాలో రవితేజ అలా వచ్చి వెళ్లిపోవటం కాదని, ఓ సర్పైజ్ గా ఉంటుందని చెప్తున్నారు. సినిమాలో కథను మలుపు తిప్పేదిగా ఈ గెస్ట్ పాత్ర ఉంటుందని చెప్తున్నారు. పూరీ జగన్నాధ్ స్క్రిప్టు వర్క్ చేసిన ఈ చిత్రానికి ఆయన శిష్యుడు గోపీ గణేష్ డైరక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'పూరి రాసిన ప్రేమకథ' అనేది ఉపశీర్షిక.
అడోనిక (పరిచయం) హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని మహర్షి సినిమా పతాకంపై వల్లూరిపల్లి రమేష్ నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''చరిత్రలో నిలిచిపోయిన ప్రేమజంట రోమియో- జూలియెట్. వీరు యూరప్లో కలిసే ప్రదేశం 'వెరోనా'. ఈ ప్రాంతంలో జరిగే ప్రేమకథే 'రోమియో. కథ, మాటలు ఇచ్చారు కాబట్టి ఉపశీర్షిక పూరి పేరు మీదే నిర్ణయించాం''అన్నారు. తనకూ పూరీ జగన్నాధ్ కి ఉన్న స్నేహంతో ఈ గెస్ట్ పాత్రను ఒప్పుకున్నాడని తెలుస్తోంది.
మరో ప్రక్క రవితేజ తాజా చిత్రంలో నారా రోహిత్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. రవితేజ, కాజల్ కాంబినేషన్ లో 'సార్ వస్తారు' టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పరుసరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మరో యంగ్ హీరో నారా రోహిత్ స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఆ పాత్ర కథను కీలకమైన మలుపు తిప్పనుందని తెలుస్తోంది. గతంలో పరుసరామ్,నారా రోహిత్ కాంబినేషన్ లో సోలో అనే చిత్రం రూపొందింది. ఈ అనుబంధంతో ఈ ప్రత్యేక పాత్రకు నారా రోహిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ ప్రాజెక్టు నిమిత్తం రవితేజ రెమ్యునేషన్ తీసుకోకుండా కేవలం షేర్ మాత్రం తీసుకునేటట్లు ఎగ్రీ అయ్య శక్తి ప్లాప్ తో లాస్ లో ఉన్న నిర్మాతకు భారం తగ్గించాడని తెలుస్తోంది. అలాగే దర్శకుడు పరుశరామ్ కి సైతం రెమ్యునేషన్ ని సినిమా పూర్తయ్యి అమ్ముడయ్యాక తీసుకునేడట్లు ఎగ్రిమెంట్ చేయించాడని చెప్పుకుంటున్నారు. అలా ఓ పెద్ద నిర్మాతను రవితేజ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. అందులోనూ గతంలో రవితేజ, పరుశరామ్ కాంబినేషన్ లో ఆంజనేయులు చిత్రం వచ్చింది. ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ చేస్తూ యాక్షన్ ఎంటర్టనర్ చేస్తున్నట్లు వినికిడి. ఇక రవితేజ ప్రస్తుతం చేసిన దరువు చిత్రం రిలీజ్ అయ్యి ప్లాప్ టాక్ తెచ్చుకుంది.