గోపీచంద్ దర్శకుడుతో రవితేజ
గోపీచంద్ తో చేసిన 'శౌర్యం'చిత్రం హిట్టవటంతో దర్శకుడుగా మారిన శివ బాగా బిజీ అయ్యారు. అయితే వెంటనే వచ్చిన 'శంఖం' డిజాస్టర్ కావటంతో మళ్లీ వెనక్కి వెళ్లిపోయారు. ఈ నేపధ్యంలో ఆయన తన తాజా చిత్రానికి స్క్రిప్టు రెడీ చేసుకుని, హీరోని ఒప్పించుకున్నారు. రవితేజ హీరోగా అనుకుని తయారు చేసిన కథని వినిపించారు. రవితేజ వెంటనే ఇంప్రెస్ అయి డేట్స్ కేటాయించారు. బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించే ఈ చిత్రం పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. ఈ లోగా శివ తమిళంలో కార్తీ హీరోగా సిరుతై చిత్రంతో హిట్ కొట్టారు. తెలుగులో వచ్చిన విక్రమార్కుడు చిత్రానికి రీమేక్ గా రూపొందిన ఆ చిత్రం భాక్సాపీస్ వద్ద మంచి క్రేజ్ నే తెచ్చిపెట్టింది. అయితే తెలుగులోనే ఆయన మరో చిత్రం రూపొందించాలని నిర్ణయించుకుని రవితేజతో ఓకే చేయించుకున్నారు. ఇక నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ గతంలో పలు చిత్రాలు నిర్మించిన ఆయన కొంత విరామం తర్వాత ఈ చిత్రాన్ని తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











