Don't Miss!
- News రామేశ్వరం కేఫ్ కేసులో ట్విస్ట్, క్లాస్ మేట్ కోసం ఏం చేశాడంటే?, బాంబర్ తో అన్ని నెలలు!
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
విలన్ పాత్రపై రవితేజ క్లారిటీ.. రాజమౌళి మల్టీస్టారర్ సినిమాపై కామెంట్..
బాహుబలి చిత్రం తర్వాత దర్శకధీరుడు రాజమౌళి సినిమా ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, రాంచరణ్తో తన తదుపరి చిత్రమని చెప్పకనే చెప్పారు. అయితే ఇంకా ఆ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. అయితే తాజాగా మల్టీస్టారర్ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే..
Recommended Video
విలన్ పాత్రలో రవితేజ
రాజమౌళి రూపొందించే చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ లిద్దరూ బాక్సర్లుగా కనిపిస్తారట. అయితే ఈ చిత్రంలో విలన్ది పవర్ఫుల్ పాత్ర అని తెలిసింది. ఆ పాత్ర కోసం మాస్ మహారాజా రవితేజను రాజమౌళి సంప్రదించినట్టు ఓ వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతున్నది.
రవితేజ వ్యాఖ్యలతో హైప్
టచ్ చేసి చూడు సినిమా ప్రమోషన్లో భాగంగా తాను మల్టీస్టారర్ సినిమాలో నటించే అవకాశం ఉంది అని ఇటీవల మాస్ మహారాజా చేసిన వ్యాఖ్యలు మరింత హైప్ను క్రియేట్ చేశాయి. దాంతో రాజమౌళి చిత్రంలో రవితేజ అనే వార్త మరింత బలపడింది.
విలన్గా నటించడం లేదు
ఇలాంటి వార్తల నేపథ్యంలో రవితేజ తన అభిమానులతో మాట్లాడుతూ.. తాను విలన్గా నటించడం లేదు. నన్ను ఎవరూ సంప్రదించడం లేదు అని స్పష్టం చేశారు. దాంతో రాజమౌళి సినిమాలో రవితేజ నటిస్తున్నారని ఆశతో ఉన్న ప్రేక్షకుల నిరాశే ఎదురైంది.
కసరత్తు మొదలు
ఇదిలా ఉండగా, రాజమౌళి రూపొందించే చిత్రం కోసం రాంచరణ్, ఎన్టీఆర్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ పొందుతున్నట్టు తెలుస్తున్నది. ఈ చిత్రం అక్టోబర్ తర్వాత పట్టాలెక్కే అవకాశం ఉంది.