twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆడియో వేడుకకు చీఫ్ గెస్ట్‌గా రవితేజ

    By Bojja Kumar
    |

    దూకుడు సినిమా నిర్మాత అనిల్ సుంకర దర్శకుడిగా ఓ చిత్రానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఊగాది రోజున ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాస్ మహారాజ రవితేజ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు. చెన్నయ్‌లో ఉదయం 7 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. అల్లరి నరేష్, కిక్ శ్యామ్, రాజు సుందరం, వైభవ్, కామ్నా జఠ్మలానీ, విమలా రామన్, స్నేహా ఉల్లాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈచిత్రాన్ని అనిల్ సుంకర తన సొంత బ్యానర్ ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

    దాదాపు రూ. 15 కోట్ల అంచనా వ్యయంతో ఈ సినిమాకు బడ్జెట్ ప్లానింగ్ వేసినట్లు తెలుస్తోంది. గతంలో అనిల్ సుంకర... బిందాస్, అహనా పెళ్లంట చిత్రాలకు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఆ క్రమంలోనే సినిమా షూటింగులను చాలా దగ్గర నుంచి వీక్షించి దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్నాడని, పక్కా కథ తయారు చేసుకుని దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

    English summary
    Mass Maharaja Ravi Teja is the Chief Guest for ‘Dookudu’ producer Anil Sunkara's new 3D film launch. The new film is being launched on Ugadi day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X