twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ ది మొదలైంది

    By Staff
    |

    Ravi Teja
    ఇడియట్, నేనింతే, దుబాయి శీను అంటూ దూసుకొచ్చిన రవితేజ లేటెస్ట్ గా ఆంజనేయులుగా ప్రత్యక్షం కాబోతున్నాడు. నయనతార హీరోయిన్ గా పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై హాస్య నటుడు గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.రవితేజ మాట్లాడుతూ, ఇది ఓ ఫ్యామిలి ఎన్టర్ టైనర్. దర్శకుడు పరశురాం చేసిన యువత చిత్రం చూశాను.బాగా నచ్చింది. అలాగే అతను కథ చెప్పిన విధానం బాగుంది.అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న చిత్రమిది' అని అన్నారు. దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ నన్ను నమ్మి రవితేజ నాపై పెద్ద బాధ్యత పెట్టారు. వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటాను' అని అన్నారు.

    నిర్మాత గణేష్‌బాబు మాట్లాడుతూ 'రవితేజ కెరీర్‌లో ఇది ఓ సెన్సేషనల్‌ ఫిలిమ్‌ అవుతుంది. రవితేజ, నయనతార కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంలో భారీ తారగణం ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 20 నుండి మే 9 వరకు హైదరాబాద్‌లో షెడ్యూల్‌ చేస్తాం మే 12 నుండి 25 వరకు విదేశాల్లో సాంగ్స్‌ చిత్రీకరించడానికి ప్లాన్‌ చేసాం. జూన్‌లో చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేసి ఆగస్ట్‌లో రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

    ప్రకాష్‌రాజ్‌, షాయాజీ షిండే, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, నాజర్‌, జయప్రకాశ్‌రెడ్డి, ఆహుతి ప్రసాద్‌, ఎం.ఎస్‌.నారాయణ, సన, వినయప్రసాద్‌, మాస్టర్‌ భరత్‌, జీవా, 'సత్యం" రాజేష్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: కె.రవీంద్రబాబు, సంగీతం: ఎస్‌.థామస్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, ఆర్ట్స్‌: చిన్నా, సమర్పణ: రవికిరణ్‌బాబు, నిర్మాత: గణేష్‌బాబు, కథ,స్క్రీన్‌ప్లే,మాటలు, దర్శకత్వం: పరశురామ్‌.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X