Don't Miss!
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రవితేజ, రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ లో
నిన్నటి తరం కామిడీ హీరో రాజేంద్రప్రసాద్,కామిడిని అలవోకగా పండించే రవితేజ కాంబినేష్ లో ఓ సినిమా మొదలైంది.'శౌర్యం" ఫేం శివ దర్శకత్వంలో బూరుగుపల్లి శివరామకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.పస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో 'నిప్పు", పూరిజగన్నాథ్ దర్శకత్వంలో 'ఇడియట్-2" చిత్రాలు చేస్తున్న రవితేజ మరో సినిమాకు పచ్చజెండా ఊపారు. గురువారం హైదరాబాద్లోని సంస్థ కార్యాలయంలో ఈ చిత్రం లాంఛనంగా మొదలైంది. దేవుని పటాలపై ముహూర్తపు దృశ్యాన్ని చిత్రీకరించారు.
ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ -''శివ సెన్సిబుల్ డెరైక్టర్. తనకు మాస్ పల్స్ బాగా తెలుసు. కథ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. బూరుగుపల్లి శివరామకృష్ణ బ్యానర్లో ఓ మంచి సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది"" అన్నారు.అనంతరం దర్శకుడు శివ మాట్లాడుతూ...''ఇప్పటివరకూ చేయని భిన్నమైన పాత్రని ఇందులో రవితేజ చేస్తున్నారు. సరదాగా సాగిపోయే కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. మాస్ మేచ్చే అంశాలు ఇందులో మొండుగా ఉంటాయి. డా.రాజేంద్రప్రసాద్ ఇందులో ఓ కీలక భూమిక పోషిస్తున్నారు""అని చెప్పారు.
రవితేజతో సినిమా చేయడం ఆనందంగా ఉందని, దర్శకుడు శివ అద్భుతమైన కథ తయారు చేశారని, ఈ చిత్రం తప్పకుండా అందరినీ అలరిస్తుందని నిర్మాత చెప్పారు. బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘుబాబు, సాయాజీషిండే, వెన్నెల కిషోర్ ఇతర పాత్రలు పోషించే ఈ చిత్రానికి కథ: శివ, ఆదినారాయణ, ఎడిటింగ్: గౌతంరాజు, సంగీతం: విజయ్ ఆంథోని, కెమెరా: వెట్రి, సమర్పణ: నాగమునీశ్వరి, నిర్మాణం: శ్రీవెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్.