Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జనవరి ఆరున మాస్ మహారాజా రవితేజ ‘నిప్పు’...!?
మాష్ మహారాజ రవితేజ కొత్త సినిమా 'నిప్పు" శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వైవిఎస్ చౌదరి నిర్మాతగా, బొమ్మరిల్లు బానర్ లో గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. దీనికంటే ముందు రవితేజ 'వీర" సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా కొట్టింది అలాగే గుణ శేఖర్ ఖాతాలో కూడా వరుడు లాంటి ఫ్లాప్ సినిమా ఉంది. దీనితో ఇద్దరు కలిసి మంచి సూపర్ హిట్ సినిమా చేద్దాం అనే తపనతో నిప్పు మొదలు పెట్టారు. అంతే కాదు రవితేజ సరసన మిరపకాయ్ ఫేం దీక్ష సేథ్ నటిస్తోంది. దీక్ష కి కూడా ఇప్పటివరకు మంచి హిట్ లేదు. ఈ సినిమా హిట్ అవడంఅందరికి చాలా అవసరం. మిరపకాయ్ చిత్రం తర్వాత రవితేజ సరసన రెండో సారి దీక్షా సేథ్ జతకడుతోంది.
సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీలో రూపుదిద్దికుంటున్న ఈ చిత్రం హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ఈ సినిమా పొల్లాచ్చి లో షూటింగ్ జరుపుకుంటోంది. పాటల చిత్రీకరణ తో పాటు కొన్ని టాకీ సన్నివేశాలని కూడా చిత్రిస్తున్నారు. ఈ చిత్రం ఓ మాస్ ఎటంర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా బాణీ లు సమకూరుస్తున్నాడు. గుణ శేఖర్, రవితేజ మొట్ట మొదటి సారి గా కలిసి చేస్తున్న చిత్రాన్ని జనవరి 6 2012న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.