twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్షేమం...పూరీ,రవితేజ

    By Staff
    |

    Ravi Teja
    నేనింతే యూనిట్ నిన్న ధాయ్ లాండ్ లో చిక్కుపడిపోవటం ఆందోళనలకు,రూమర్స్ కి దారితీసింది. అయితే తామంతా క్షేమంగానే ఉన్నామని,ఓ హోటల్ రూమ్ లో భద్రంగానే ఉన్నామని పూరి,హాస్య నటుడు గణేష్ కి ఫోన్ చేసి చెప్పటం జరిగింది. గణేష్ వెంటనే అన్ని మీడియా సంస్ధలకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు.గణేష్ నేనింతే అనంతరం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారు.

    ఇక రవితేజ అభిమానులను ఆందోళనపడవద్దని ఆ ప్రకటనలో ఆయన ప్రత్యేకంగా కోరారని సమాచారం.అక్కడ పరిస్ధితులు తిరుగు ప్రయాణానికి అనుకూలంగా లేవని అందుకే ఆగామని,కాస్త కుదుటపడిన వెంటనే బయిలు దేరుతామని పూరి చెప్పారని గణేష్ చెప్పుతున్నారు.నిన్న సెల్ ఫోన్స్ సరిగా పనిచేయకపోవటం వల్ల ఫోన్ లో ఎవరికి లైన్ కలవలేదని పూరి వివరించారు. మొత్తానికి నేనింతే టీమ్ పాట కోసం వెళ్ళి ఇరుక్కుపోవంటం మరికొంతమంది నిర్మాతలను ఆలోచనలో పడేస్తోంది.ఇప్పుడు ధాయ్ లాండ్ ,బ్యాంకాక్ స్టోరీ డిస్కషన్స్ కి,రిలాక్సేషన్ కి సినిమావాళ్ళు వినియోగించుకుంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X