Don't Miss!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రెచ్చిపోయారంతే : తమన్నా, రాశి ఖన్నా ...మధ్యలో రవితేజ (వీడియో)
హైదరాబాద్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రవితేజ, తమన్నా, రాశీ ఖన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బెంగాల్ టైగర్'. సంపత్నంది డైరక్షన్ లో రూపొందిన ఈ చిత్రానికి కె.కె. రాధామోహన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 27న 'బెంగాల్ టైగర్' ప్రేక్షకుల ముందుకు రానుందని అఫీషియల్ గా దర్శకుడు ప్రకటించారు. దాంతో చిత్రం ప్రమోషన్స్ పై పూర్తి దృష్టి పెట్టింది యూనిట్. అందులో భాగంగా చిత్రంలోని సాంగ్ టీజర్ ని విడుదల చేసింది. ఈ పాటలో తమన్నా, అటు రాశి ఖన్నా, రవితేజ ముగ్గురూ రెచ్చిపోయి డాన్స్ చేసారు.
అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ చిత్రంలో రవితేజ తను అమితంగా ప్రేమించే తండ్రిని చంపిన విలన్స్ ని సంహరించి, పగ తీర్చుకునే కొడుకుగా కనిపించనున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా ఫ్యామిలీ రివేంజ్ డ్రామాగా సాగనుందని తెలుస్తోంది.
రవితేజ మాట్లాడుతూ... ''సినిమా బాగా వచ్చింది. బీమ్స్ మంచి పాటలిచ్చాడు. తమన్నా అక్షర దోషాలు లేకుండా తెలుగు బాగా మాట్లాడుతోంది. ఆమెను చూస్తుంటే ముచ్చటేస్తుంది. నాలుగైదు సినిమాల తరవాత రాశీ ఖన్నా ఇలానే తెలుగు మాట్లాడాలి. సంపత్కి హ్యాట్రిక్ సినిమా అవుతుందని నా నమ్మకము''అన్నారు.
దర్శకుడు చెబుతూ.... ''నేను ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన వ్యక్తి రవితేజ. ఒకే సిట్టింగ్లోనే కథ ఓకే చేశారు. బీమ్స్కి నేనేదో లైఫ్ ఇచ్చాననుకొంటున్నారు. ఆ ఘనతా రవితేజగారిదే. రవితేజ అభిమానులకు వెయ్యి శాతం సంతృప్తినిచ్చే సినిమా ఇది''అన్నారు.
ఈ సినిమా సరికొత్త థియోటర్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఆ మధ్యన విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూసిన వారు ఈ ఒక్కటి చాలు బిజినెస్ అవ్వటానికి అన్నట్లు మాట్లాడుకుంటున్నారు. ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.
రవి తేజ సరసన తమన్న, రాశి ఖన్నాలు ఆడిపాడునున్నారు. సంపత్ నంది రెండవ సినిమా రచ్చలో కూడా తమన్ననే హీరోయిన్ కావడం విశేషం. ఏమైంది ఈ వేళతో ప్రతిభ గల దర్శకునిగా పేరు తెచ్చుకున్నాడు. రెండవ సినిమాతోనే రామ్ చరణ్ సినిమాకు దర్శకత్వం చేశాడు. రచ్చ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్2 కు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది.
ఆ సినిమా స్రిప్టు తయారు చేసే పనిలో దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయాయి. కారణం ఏంటో తెలియదు కాని ఆ సినిమా నుంచి సంపత్ నంది తప్పుకున్నాడు. అనూహ్యంగా రవితేజాను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. రవితేజకు తమన్నతో తొలి సినిమా. తమన్న తన అందచందాలతో మురిపించబోతోంది.