Don't Miss!
- News ఆన్లైన్లోనూ నామినేషన్లు దాఖలు.. తొలిరోజు తెలంగాణాలో దాఖలైన నామినేషన్లివే!!
- Sports IPL:ధోనీ ఫిక్సింగ్ చేశాడా..? సీఎస్కేను రెండేళ్లు ఎందుకు బ్యాన్ చేశారు..?
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మాస్ మహారాజా ఇమేజ్కి తగినట్టుగా.. అద్భుతంగా టచ్ చేసి చూడు.. సెన్సార్ రిపోర్ట్..
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం 'టచ్ చేసి చూడు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. ఫిబ్రవరి 2న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా...
సెన్సార్ యూ/ఎ సర్టిఫికేట్
విక్రమ్ సిరికొండ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాశీఖన్నా, సీరత్ కపూర్ నాయికలు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఎ సర్టిఫికేట్ను పొందింది.
పాటలకు మంచి రెస్పాన్స్
నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. టచ్ చేసి చూడు` చిత్రం సెన్సార్ పూర్తయ్యింది. సినిమాకు `యు/ఎ` సర్టిఫికేట్ వచ్చింది. ఈ వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహిస్తాం. ఇటీవల సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన పాటలకు , టీజర్కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది అని అన్నారు.
స్టైలిష్గా రవితేజ
రవితేజ చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారని సర్వత్రా అందరూ ప్రశంసిస్తున్నారు. మాకు చిరకాల మిత్రుడైన రవితేజ తో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని బుజ్జి చెప్పారు.
మాస్ మహారాజా ఇమేజ్కు తగినట్టుగా
మాస్ మహారాజా ఇమేజ్కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారు చేశారు. ఫిబ్రవరి 2న సినిమా విడుదలవుతుంది. చూసిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుంది`` అని బుజ్జి తెలిపారు.
సాంకేతిక వర్గం వీరే
ఈ చిత్రానికి సంగీతం : జామ్ 8, కథ : వక్కంతం వంశీ, స్క్రీన్ ప్లే : దీపక్ రాజ్, మాటలు : శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి మల్లు,కేశవ్ , ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్: రమణ, ఛాయాగ్రహణం : చోటా.కె.నాయుడు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం : విక్రమ్ సిరికొండ.