Don't Miss!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సల్మాన్ ఖాన్తో రవితేజ ఫైట్!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్....టాలీవుడ్ మాస్ మహ రాజ్ రవితేజ ఫైట్కు రెడీ అవుతున్నాడు. ఫైట్ అంటే మరేదో అనుకోవద్దు. వీరి మధ్య బాక్సాఫీస్ ఫైట్ జరుగబోతోంది. ఈ ఇద్దరు స్టార్స్ నటిస్తున్న చిత్రంలో ఒకే రోజు ఆగస్టు 15న విడుదలకు సిద్ధం అవుతున్నాయి.
మాస్ మహరాజా రవితేజ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి బేనర్ పై భారీ చిత్రాల నిర్మాత చత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్న 'దేవుడు చేసిన మనుషులు' చిత్రాన్ని ఆగస్టు 15న వరల్డ్ వైడ్గా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
2008 సంవత్సరంలో విడుదలైన 'యువరాజ్' చిత్రంలో సల్మాన్, కత్రినాలు కలిసి నటించారు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న 'ఏక్ థా టైగర్' చిత్రం ఆగస్టు 15 తేదిన విడుదలకు సిద్ధమౌతోంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైంది. ఈచిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తుండగా, ఆదిత్య చోప్రా నిర్మించారు.
టాలీవుడ్ బాక్సాఫీసు వరకు మాస్ మహారాజ రవితేజదే పైచేయి అని చెప్పక తప్పదు. మరి సల్మాన్ ఖాన్ ఏక్ థా టైగర్ చిత్రం బాలీవుడ్లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.