Don't Miss!
- News మోదీ ప్రధాని అయ్యే వరకు నిద్రపోము, ఎవరు మునిగిపోతారో జూన్ 4వ తేదీ తెలుస్తుంది సీఎం గారు !
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Technology Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సల్మాన్ ఖాన్తో రవితేజ ఫైట్!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్....టాలీవుడ్ మాస్ మహ రాజ్ రవితేజ ఫైట్కు రెడీ అవుతున్నాడు. ఫైట్ అంటే మరేదో అనుకోవద్దు. వీరి మధ్య బాక్సాఫీస్ ఫైట్ జరుగబోతోంది. ఈ ఇద్దరు స్టార్స్ నటిస్తున్న చిత్రంలో ఒకే రోజు ఆగస్టు 15న విడుదలకు సిద్ధం అవుతున్నాయి.
మాస్ మహరాజా రవితేజ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి బేనర్ పై భారీ చిత్రాల నిర్మాత చత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్న 'దేవుడు చేసిన మనుషులు' చిత్రాన్ని ఆగస్టు 15న వరల్డ్ వైడ్గా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
2008 సంవత్సరంలో విడుదలైన 'యువరాజ్' చిత్రంలో సల్మాన్, కత్రినాలు కలిసి నటించారు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న 'ఏక్ థా టైగర్' చిత్రం ఆగస్టు 15 తేదిన విడుదలకు సిద్ధమౌతోంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైంది. ఈచిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తుండగా, ఆదిత్య చోప్రా నిర్మించారు.
టాలీవుడ్ బాక్సాఫీసు వరకు మాస్ మహారాజ రవితేజదే పైచేయి అని చెప్పక తప్పదు. మరి సల్మాన్ ఖాన్ ఏక్ థా టైగర్ చిత్రం బాలీవుడ్లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.