Don't Miss!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పవన్ కళ్యాణ్ ప్లేస్లోకి రవితేజ వచ్చాడా..!
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడంటూ చాలా కాలం పాటు వార్తలు వచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కాల్సింది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీకావడంతో ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. తమిళ బ్లాక్ బాస్టర్ చిత్రం తేరి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కథలో కీలక మార్పులు చేసి పవన్ కళ్యాణ్ కు అనుగుణంగా సంతోష్ శ్రీనివాస్ కథ సిద్ధం చేశారు.
పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పుకోవడంతో సంతోష్ శ్రీనివాస్ రవితేజతో తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. తమిళ కథలోని పాయింట్ ని తీసుకున్న సంతోష్ శ్రీనివాస్ దానిని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మలిచారు. జులై నుంచి ఈ చిత్రం మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ చిత్రంలో రవితేజ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. కాజల్ ఇదివరకే రవితేజతో రెండు చిత్రాల్లో నటించింది. వీర, సారొచ్చారు చిత్రాల్లో కాజల్, రవితేజ జంటగా నటించారు. కేథరిన్ మరో హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది.