Don't Miss!
- News ఏడాది పొడవునా శశ రాజయోగం.. ఈ రాశులకు డబ్బే డబ్బు
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
బెల్లంకొండ రీమేక్ హీరో ఎవరంటే...
బెల్లంకొండ సురేష్ తాజాగా తమిళంలో హిట్టయిన నడోడిగల్ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ని తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోగా ఎవరిని తీసుకోవాలనే సందిగ్ధంలో ఉన్నారు. అయితే రవితేజ ఆ చిత్రం చూసి తాను నటిస్తాననటంతో బెల్లంకొండ చాలా సంతోషంగా ఉన్నారని సమాచారం. మాస్ లుక్ తో స్నేహం బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ చిత్రం తమిళ వెర్షన్ లో శశికుమార్(అనంతపురం ఫేమ్)నటించారు.
ఇక బాలకృష్ణ అంటే వీరాభిమానం ప్రకటించే బెల్లంకొండ సురేష్ ఆయనతో బీష్మ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.తనకి రైడ్ తో హిట్ ఇచ్చిన రమేష్ వర్మకి ఈ చిత్రం దర్శకత్వ బాధ్యత ఇచ్చారు.అలాగే రవితేజ హీరోగా ఓ చిత్రం ప్రారంభంచటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ చిత్రాన్ని కృష్ణ వంశి డైరక్ట్ చేయనున్నారు.
ప్రస్తుతం ఆంజనేయులు షూటింగ్ లో బిజీగా ఉన్న రవితేజ దాని తర్వాత ఈ చిత్రమే చేయనున్నట్లు సమాచారం. అలాగే కృష్ణవంశి కూడా మహాత్మ అనంతరం ఏ ప్రాజెక్టు కమిట్ కాలేదు. ఇంతకుముందు రెండు మూడు సార్లు కృష్ణవంశితో రవితేజ చిత్రం చేయాలని ప్లాన్ చేసారు. కథ కుదరక ఒకసారి, డేట్స్ కుదరక మరో సారి, వేరే కమిట్ మెంట్స్ తో మరోసారి వాయిదా పడుతూ వచ్చింది. దాంతో ఈ సారి కన్ఫర్మ్ గా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆంజనేయులు చిత్రాన్ని యువత దర్శకుడు పరుశరామ్ డైరక్ట్ చేస్తున్నాడు. నయనతార..ఈ చిత్రంలో రవితేజకి జోడిగా చేస్తోంది. ఖడ్గం తర్వాత వీరి కాంబినేషన్లో రానున్న చిత్రంపై అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. ఇంతకు ముందు రవితేజతో బెల్లంకొండ నా ఆటోగ్రాఫ్ చిత్రాన్ని నిర్మించారు.ఇప్పుడీ రీమేక్ ని మరి కృష్ణవంశి డైరక్ట్ చేస్తారా లేక వేరే డైరక్టర్ ని ఎన్నుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. తమిళంలో ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసిన సముద్ర ఖనికే ఈ చిత్రం డైరక్షన్ అప్పచెప్పాలనే ఆలోచనలో బెల్లంకొండ ఉన్నారని సమాచారం.