Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మళ్లీ తెరపైకి రవితేజ ‘పవర్’
రవితేజ, మెహర్ రమేష్ కాంబినేషన్లో 'పవర్' సినిమా రూపొందుతున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే మధ్యలో ఆ సినిమా అటకెక్కినట్లు ప్రచారం జరిగింది. రవితేజగానీ, మెహర్ రమేష్ గానీ ఆ చిత్రం గురించి మాట్లాడటం మానేయడంతో ఇక 'పవర్' లేనట్లే అని అంతా భావించారు. తాజాగా రవితేజ బర్త్ డేను పురస్కరించుకుని వార్తా పత్రికల్లో 'పవర్' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ యాడ్ ను ప్రచురించారు నిర్మాతలు. దీన్ని బట్టి సినిమా త్వరలోనే తెరకెక్కిస్తున్నామనే సంకేతాలు అభిమానుల్లోకి పంపారు. ఈ చిత్రాన్ని విజయప్రసాద్ ముళ్ల వెల్ఫేర్ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్నారు. వక్కతం వంశీ కథను అందించారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
ప్రస్తుతం రవితేజ గుణశేఖర్ దర్శకత్వంలో 'నిప్పు' సినిమా చేస్తున్నారు. వైవిఎస్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం పిబ్రవరి 17న విడుదల కాబోతోంది. ఈ చిత్రం తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'దేవుడు చేసిన మనుషులు' చిత్రంలో నటించనున్నాడు. మరో వైపు మెహర్ రమేష్ ప్రస్తుతం వెంకీ హీరోగా 'షాడో' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయింది. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత 'పవర్' ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.