twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రంభ బిల్డప్పులు...

    By Staff
    |

    Rambha
    తమిళ చిత్ర పరిశ్రమలో రంభ హాట్ టాపిక్ గామారింది. కారణం ఆమె రీ ఎంట్రీ ఇస్తోందని కాదు. ఆమె తన సినిమా ఓపినింగ్ రోజన ఇచ్చిన బిల్డప్ చూసిట. దాదాపు మూడు సంవత్సరాల విరామం తర్వాత తమిళంలోకి రంభ 'Vidiyum Varai Kathiru' అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. గతంలో ఆమె రజనీ (అరుణాచలం), కమల్ హాసన్ ('Kadhala Kadhala') వంటిపెద్ద స్టార్స్ తో చేసింది. అలాగే అక్కడ జ్యోతిక, లైలా లను 'త్రీ రోజెస్' పేరుతో సినిమా నిర్మించింది. ఇక ఈ సినిమా ఓపినింగ్ రోజున రంభ "నేను ఇన్నాళ్ళూ మంచి స్క్రిప్టు కోసమే ఖాళీగా ఉన్నాను. చాలా కథలు విన్నాను. అందరూ నా గ్లామర్ ని, క్రేజ్ ని కేష్ చేసుకుందామనుకునే వాళ్ళే వచ్చారు. అయినా నాకు కెరీర్ గూర్చి భయం గానీ కంగారు గానీ లేదు".

    "ఎంతకాలమైనా వెయిట్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. ఇంతలో ఇన్నాళ్ళుకు ఈ సినిమా కథని దర్శకుడు వచ్చి నేరేట్ చేసాడు. మొదటి సిట్టింగ్ లోనే ఓ.కే.చేసేసాను" అని బిల్డప్ లు ఇస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్ర చేస్తున్నాడు. తెలుగులోనూ డబ్బింగ్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట. అసలు ఎవరు ఫేడవుట్ అయిన ఆమెను కలిసి కథ చెప్పారు అని ప్రక్కకు వచ్చి నవ్వుకుంటున్నారు. ఆమె చెప్పే ఈ మాటలని బట్టి "అయితే ఈ మధ్య తెలుగులో చేసిన 'దొంగసచ్చినోళ్ళు' ఆమె దృష్టిలో గొప్ప స్క్రిప్టు అయ్యుంటుంది. బిల్డప్ లు ఎక్కువ బిజెనెస్ తక్కువ అంటే ఇదే" అని మన టాలీవుడ్ వాసులు పైకే కామెంట్ చేస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X