Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రవితేజ కొత్త సినిమా ప్రారంభం, మూడోసారీ ఆ హీరోయిన్ తో!
మాస్ మహారాజ ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేల టికెట్టు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో ఈనెల 10న గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు హాజరు కాబోతున్నాడు. ఈ సినిమా తరువాత శ్రీను వైట్ల, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ నటించబోతున్న సంగతి తెలిసిందే.
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలెట్టేశారు. తాజా సమాచారం మేరకు రవితేజ ఈరోజు (సోమవారం) సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకేక్కబోయే తేరి రీమేక్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమా నిర్మించబడుతోంది.
గతంలో హీరో రవితేజతో కలిసి 'వీర','సారొచ్చారు' వంటి సినిమాల్లో నటించింది కాజల్ అగర్వాల్. ఆ రెండు సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ ను సాధించలేకపోయాయి. అయితే ఇప్పుడు మరోసారి కాజల్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు మాస్ మాహారాజ. సంతోష్ శ్రీనివాస్ తెరకేకిస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.