Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రవితేజ కొత్త సినిమా ప్రారంభం, మూడోసారీ ఆ హీరోయిన్ తో!
మాస్ మహారాజ ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేల టికెట్టు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో ఈనెల 10న గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు హాజరు కాబోతున్నాడు. ఈ సినిమా తరువాత శ్రీను వైట్ల, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ నటించబోతున్న సంగతి తెలిసిందే.
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలెట్టేశారు. తాజా సమాచారం మేరకు రవితేజ ఈరోజు (సోమవారం) సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకేక్కబోయే తేరి రీమేక్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమా నిర్మించబడుతోంది.
గతంలో హీరో రవితేజతో కలిసి 'వీర','సారొచ్చారు' వంటి సినిమాల్లో నటించింది కాజల్ అగర్వాల్. ఆ రెండు సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ ను సాధించలేకపోయాయి. అయితే ఇప్పుడు మరోసారి కాజల్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు మాస్ మాహారాజ. సంతోష్ శ్రీనివాస్ తెరకేకిస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.