Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ కమీడియన్స్ తో రవితేజ సినిమా... శ్రీనువైట్ల మార్క్ కామెడి...
నటుడు రవితేజ, దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్లో వస్తోన్న 'అమర్ అక్బర్ ఆంటోనీ'లో సినిమా రూపుదిద్దుకుంటోంది. రవితేజ సరసన అను ఇమ్మాన్యూల్ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. సునీల్ ఈ సినిమాతో పూర్తి స్థాయి కమిడియన్ గా కనిపించబోతున్నాడు.
రవితేజ, శ్రీను వైట్ల సినిమాలో శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్, రఘుబాబు వంటి కమిడియన్స్ నటిస్తున్నారు. ప్రస్తుతం వీరిపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. పాత కథానాయకి లయ మరియు ఆమె కుమార్తె శ్లోక కూడా ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించనుండడం విశేషం. వారి పాత్రల వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ సినిమలో రవితేజ తనయుడు మహాధన్ మరో ముఖ్యపాత్రలో కనిపించబోతున్నాడు. ఓ సినిమాలో మూడు పాత్రలు చేయడం రవితేజకు ఇదే మొదటిసారి. పూర్తి వినోదభరితంగా సాగే ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు చిత్ర యూనిట్ త్వరలో తెలుపనుంది. ఈ సినిమాతో శ్రీనువైట్ల బ్యాక్ అవుతాడని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.