రాయలసీమతో సంబంధం ఏంటి.. ఆసక్తి రేపుతున్న మహేష్ 25!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను మంచి విజయం సాధించింది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం రాజకీయ నేపథ్యంలో వచ్చింది. భరత్ అనే నేనులో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించి అభిమానులని అలరించాడు. భరత్ అనే నేను చిత్రం విజయం సాధించడంతో మహేష్ రిలాక్స్ మూడ్ ఉన్నాడు.
ఇదిలా ఉండగా ప్రతిష్టాత్మకమైన మహేష్ 25 వ చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. వంశి పైడి పల్లి ఈ చిత్రానికి దర్శత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం కోసం వంశి పైడిపల్లి దాదాపు రెండేళ్లు ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఊపిరి తరువాత వంశీ మరో చిత్రం చేయలేదు.

మహేష్ 25 వ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. వంశి పైడిపల్లి యూఎస్ లో లొకేషన్ల వేటలో ఉన్నారు. ఈ చిత్రం ఎక్కువ భాగం యుఎస్ లో షూటింగ్ జరుపుకోనుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. పూజ హెగ్డే తొలిసారి మహేష్ కు హీరోయిన్ గా చేయబోతోంది. ఈ చిత్రం గురించిన పూర్తి వివరాలు చిత్ర యూనిట్ వెల్లడించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











