Don't Miss!
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
రాయలసీమతో సంబంధం ఏంటి.. ఆసక్తి రేపుతున్న మహేష్ 25!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను మంచి విజయం సాధించింది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం రాజకీయ నేపథ్యంలో వచ్చింది. భరత్ అనే నేనులో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించి అభిమానులని అలరించాడు. భరత్ అనే నేను చిత్రం విజయం సాధించడంతో మహేష్ రిలాక్స్ మూడ్ ఉన్నాడు.
ఇదిలా ఉండగా ప్రతిష్టాత్మకమైన మహేష్ 25 వ చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. వంశి పైడి పల్లి ఈ చిత్రానికి దర్శత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం కోసం వంశి పైడిపల్లి దాదాపు రెండేళ్లు ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఊపిరి తరువాత వంశీ మరో చిత్రం చేయలేదు.
మహేష్ 25 వ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. వంశి పైడిపల్లి యూఎస్ లో లొకేషన్ల వేటలో ఉన్నారు. ఈ చిత్రం ఎక్కువ భాగం యుఎస్ లో షూటింగ్ జరుపుకోనుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. పూజ హెగ్డే తొలిసారి మహేష్ కు హీరోయిన్ గా చేయబోతోంది. ఈ చిత్రం గురించిన పూర్తి వివరాలు చిత్ర యూనిట్ వెల్లడించాల్సి ఉంది.