Don't Miss!
- Sports RCB vs KKR: చెలరేగిన కోహ్లీ, కార్తీక్.. కేకేఆర్ ముందు భారీ లక్ష్యం!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
పూరి కొడుకు ప్రేమ కథలో రియల్ లైఫ్ జంట!
దర్శకుడు పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ పూరితో మెహబూబా చిత్రం చేస్తున్న సంగతి తెలిసినదే. ఇప్పటికే మెహబాబా చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. దేశ సరిహద్దుల్లో జరిగే ఉత్కంఠ భరితమైన ప్రేమ కథగా దర్శకుడు పూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కన్నడ అందాల తార నేహా శెట్టి ఈ చిత్రంలో ఆకాష్ పూరి సరసన హీరోయిన్ గా నటిస్తోంది.
కాగా ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. మెహబూబా చిత్రంలో రియల్ లైఫ్ జంట నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మురళీశర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. మురళి శర్మ భార్య అశ్విని కశ్లేఖర్ ఈ చిత్రంలో కూడా మురళి శర్మ భార్య గానే నటిస్తున్నారట. అశ్విని కశ్లేఖర్ హిందీ సీరియల్స్ లో ప్రధాన నటిగా నటిస్తున్నారు. వీరిద్దరూ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. అశ్విని పలు చిత్రాల్లో కూడా నటించారు.