Don't Miss!
- News Lok Sabha Election 2024 Polling LIVE Updates: అతిపెద్ద పండగకు తొలి ఘట్టం..
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అపుడు రూ. 1 కోటి ఇచ్చిన వరుణ్ తేజ్: నాగబాబు జనసేనలో చేరికపై ఏమన్నారంటే..!
Recommended Video
మెగా బ్రదర్ నాగబాబు తన సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరడంతో పాటు నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు బయటి నుంచి సపోర్ట్ ఇస్తూనే అధికార, ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ వచ్చిన నాగబాబు... ఇక నుంచి జనసేన ప్రతినిధిగా ఆచితూచి వ్యవహరించబోతున్నారు.
నాగబాబు జనసేనలో చేరడంతపై ఆయన తనయుడు, యువ నటుడు వరుణ్ తేజ్ స్పందించారు. 'నాన్న జనసేన పార్టీలో చేరడం, బాబాయితో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుండటం ఆనందంగా ఉంది ' అంటూ ట్వీట్ చేశారు.
|
ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ
నాగబాబు జనసేనలో చేరడంపై ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ‘‘చిన్నప్పుడు వేలు పట్టుకొని నడక నేర్పిన అన్నయ్యనే ఈ రోజు చెయ్యి పట్టుకుని ప్రజాక్షేత్రంలో అడుగులు వేయించే స్థాయికి పవన్ కళ్యాణ్ ఎదిగారు' అంటూ కామెంట్స్ గుప్పిస్తున్నారు.
వరుణ్ తేజ్ భారీ విరాళం
జనసేన పార్టీ కోసం వరుణ్ తేజ్ రూ. 1 కోటి విరాళం అందించిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి ఇంత పెద్ద మొత్తం విరాళం జనసేన పార్టీకి వెళ్లడం ఇదే తొలిసారి. జనసేన పార్టీలో చేరకముందే నాగబాబు రూ. 25 లక్షలు విరాళం అందించారు.
సీఎం అని అరవడం కాదు, వెళ్లి ఓటు గుద్దాలి: మెగాడాటర్ నిహారిక
పవన్ కళ్యాణ్కు సపోర్టుగా మెగా ఫ్యామిలీ
మెగా ఫ్యామిలీ హీరోలంతా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఉన్నారు. ఆయన నుంచి పిలుపు వస్తే చాలు తాము వెళ్లి ఏం చేయడానికైనా సిద్ధమని రామ్ చరణ్ కూడా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే.... 2019లో ‘ఎఫ్ 2' మూవీతో టాలీవుడ్లో తొలి విజయం నమోదు చేసిన వరుణ్ తేజ్ ప్రస్తుతం వాల్మీకి అనే చిత్రంలో నటిస్తున్నారు.