Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కళ్యాణ్ రామ్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ అందుకే రాలేడంట!
నందమూరి హీరో కల్యాణ్ రామ్, తమన్నా జంటగా నటించిన చిత్రం 'నా నువ్వే'. తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు షేరేత్ సంగీతం సమకూర్చారు. నిన్న విడుదలైన ఈ చిత్ర పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
ఈ చిత్రాన్ని మే 25న విడుదల చేయనున్నారు చిత్ర నిర్మాతలు. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణం వహిస్తున్నారు.
నిన్న జరిగిన నా నువ్వే సినిమా ఆడియో వేడుకకు ఎన్టీఆర్ వస్తాడని అనుకున్నారు అంతా, కాని ఎన్టీఆర్ రాలేదు. దీంతో మీడియాలో రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ ముందుగా ఈ ఫంక్షన్ కు వద్దమనే అనుకున్నాడట. కానీ అదే టైంకి హరికృష్ణ ఫ్యామిలీకి దగ్గరి బంధువైన విశాఖ దేవీసీఫుడ్స్ సంస్థ అధినేత ఇంట్లో పెళ్లి ఉండడంతో హాజరు అయ్యాడు ఎన్టీఆర్. హరిక్రిష్ణ కు వీలు పడకపోవడంతో ఎన్టీఆర్ ని పంపించాడు. అందుచేత ఎన్టీఆర్ ఈ ఫంక్షన్ కు రాలేకపోయాడని సమాచారం.