Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహేష్ బాబు ముంబై వెళ్లింది అందుకే, రహస్యంగా అతన్ని కలిశాడట!
సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్కు వెళుతున్నారా?.... అంటూ రెండు మూడు రోజులుగా వార్తకథనాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ముంబై వెళ్లిన మహేష్ పలువురు టాప్ బాలీవుడ్ డైరెక్టర్లను కలిశారంటూ ప్రచారం జరిగింది. వాస్తవం ఏమిటంటే.... మహేష్ బాబు ఏ దర్శకుడినీ కలవలేదు, ఆయనకు అసలు బాలీవుడ్లో అడుగు పెట్టాలనే ఆలోచన కూడా లేదు. ఈ విషయాన్ని గతంలో అనేక సందర్భాల్లో ఆయన స్పష్టం చేశారు. మరి అలాంటి ఉద్దేశ్యం లేనపుడు మహేష్ బాబు ముంబై ఎందుకు వెళ్లినట్లు? అని డౌట్ పడేవారికి సమాధానం దొరికింది. హకీమ్ ఆలీమ్ అనే వ్యక్తిని కలిసేందుకు ఆయన వెళ్లారట.
ఎవరీ హకీమ్ ఆలిమ్
హకీమ్ ఆలిమ్ అనే వ్యక్తి బాలీవుడ్ పాపులర్ హెయిర్ స్టైలిస్ట్. ముంబై, హైదరాబాద్తో పాటు దేశ వ్యాప్తంగా హకీమ్ అలీమ్ సెలూన్ చైన్ ఉంది. ఇతడిని కలిసేందుకే మహేష్ బాబు ముంబై వెళ్లారు మన సూపర్ స్టార్.
న్యూ లుక్ కోసమే
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోయే 25వ సినిమాలో మహేష్ బాబు న్యూ లుక్తో కనిపించబోతున్నారు. అందుకే ఆయన కొన్ని రోజులుగా జుట్టుతో పాటు గడ్డం పెంచాడు. కొత్త లుక్ గురించి చర్చించేందుకు, లుక్ టెస్టింగ్ కోసం మహేష్ బాబు అక్కడికి వెళ్లారట.
త్వరలో హైదరాబాద్ రానున్న హకీమ్ ఆలిమ్
మహేష్-వంశీ పైడిపల్లి సినిమా ప్రారంభానికి కొన్ని రోజుల ముందు హకీమ్ ఆలిమ్ హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబును మేకోవర్ చేస్తారని తెలుస్తోంది. ఈ నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది.
త్వరలో షూటింగ్ ప్రారంభం
25వ సినిమా కావడంతో మహేష్ బాబు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వ్యవసాయం, రైతులు నేపథ్యంలో సినిమా ఉంటుందని తెలుస్తోంది. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్గా అవకాశం దక్కించుకుదని, అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.