Don't Miss!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- News సీఎం జగన్ కొత్త ఎన్నికల నినాదం..డబుల్ సెంచరీ ప్రభుత్వం అంటూ
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రభాస్-అనుష్క కలిసి విదేశీ ప్రయాణం, మళ్లీ మొదలైన డౌట్స్.. కారణమేంటి?
Recommended Video
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క మధ్య అత్యంత సన్నిహితమైన స్నేహబంధం ఉంది. వీరి మధ్య ఉన్న క్లోజ్నెస్ చూసి ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతునట్లు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే అలాంటిదేమీ లేదని ఇటు ప్రభాస్ కుటుంబ సభ్యులతో పాటు అటు అనుష్క ఫ్యామిలీ కూడా స్పష్టం చేశారు.
అయితే ఇద్దరూ కలిసిన ప్రతిసారీ వీరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రభాస్, అనుష్క కలిసి జంటగా జపాన్ దేశం వెళుతుండటం చర్చనీయాంశం అయింది. ఇద్దరూ కలిసి సినిమా చేయడం లేదు? మరి వీరి ప్రయాణం వెనక రహస్యం ఏమిటనే వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి.
అసలు విషయం ఇదీ..
ఇద్దరూ కలిసి జపాన్ వెళ్లడానికి గల కారణం ఏమిటని ఆరా తీస్తే అసలు విషయం బయటకు వచ్చింది. వీరు జంటగా నటించిన ‘మిర్చి' చిత్రం జపాన్లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాను ప్రమోట్ చేయడానికి వెళుతున్నారట.
బాహుబలి విజయం ఎఫెక్ట్
బాహుబలి చిత్రం జపాన్ దేశంలో భారీ విజయం అందుకుంది. అంతే కాదు ప్రభాస్కు అభిమానులు కూడా భారీగా ఏర్పడ్డారు. ఆ మధ్య కొందరు ఫ్యాన్స్ ఉత్తరాలు సైతం రాసిన సంగతి తెసిందే. ఈ నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ నటించిన చిత్రాలను జపాన్ దేశంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
డిస్ట్రిబ్యూటర్ కోరిక మేరకు...
జపాన్ డిస్ట్రిబ్యూటర్ కోరిక మేరకు సినిమాను ప్రమోట్ చేయడానికి ప్రభాస్, అనుష్క ఒప్పుకున్నారు. ‘మిర్చి' సినిమాతో పాటు ప్రభాస్ నటించిన మరో చిత్రం ‘డార్లింగ్' కూడా జపాన్ దేశంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
ప్రభాస్, అనుష్క
ప్రస్తుతం ప్రభాస్, అనుష్క ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా గడుపుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో ‘సాహో' చిత్రం చేస్తుండగా.... అనుష్క బరువు తగ్గించుకుని త్వరలో ‘సైలెంట్' అనే సినిమా చేయడానికి సిద్ధమౌతోంది.