Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అల్లరి నరేష్ తో శ్రియ ఎందుకని?
అల్లరి నరేష్,శ్రియ కాంబినేషన్ లో త్వరలో ఓ చిత్రం పట్టాలు ఎక్కనుందనే సంగతి తెలిసిందే.దీవానా మస్తానా(1997) టైటిల్ తో హిందీలో వచ్చి హిట్టైన ఓ చిత్రాన్ని రీమేక్ చేస్తూ ఈ జంట తెరకెక్కబోతోంది.అయితే పెద్ద పెద్ద స్టార్స్ ప్రక్కన చేసిన శ్రియ ఇలా చిన్న హీరో ప్రక్కన చేయటానకి కారణం ఉందా అంటే..సక్సెస్ ఉంటేనే సినీ రంగంలో ఉంటాననే సంగతి నాకు బాగా తెలుసు. ఇక్కడ ఫెయిల్యూర్స్ వస్తే మళ్లీ మన మొహం చూడరనే సంగతి అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా.అందుకనే ఒప్పుకున్నాను.క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది అంది.
పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో నడిచే ఈ చిత్రంలో శర్వానంద్ కూడా నటిస్తున్నారు. నారాయణ దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందనున్న ఈ చిత్రాన్ని వంశీకృష్ణ నిర్మిస్తున్నారు. వైజాగ్ కి చెందిన వంశీ కృష్ణ ప్రస్తుతం నారా రోహిత్ తో సోలో చిత్రం చేస్తున్నారు. యువత ఫేమ్ పరుశరామ్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ లో ఉండగానే ఈ చిత్రాన్ని ఓకే చేసారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడవుతాయి.గమ్యంలో కూడా అల్లరి నరేష్, శర్వానంద్ నటించారు కాబట్టి ఈ చిత్రంపై మంచి క్రేజ్ వచ్చే అవకాశముందని బావిస్తున్నారు.