Don't Miss!
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- News Viral Video: రాజకీయ దిగ్గజాల కాళ్లు మొక్కిన టీడీపీ అభ్యర్ధి నిమ్మల..!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అల్లరి నరేష్ తో శ్రియ ఎందుకని?
అల్లరి నరేష్,శ్రియ కాంబినేషన్ లో త్వరలో ఓ చిత్రం పట్టాలు ఎక్కనుందనే సంగతి తెలిసిందే.దీవానా మస్తానా(1997) టైటిల్ తో హిందీలో వచ్చి హిట్టైన ఓ చిత్రాన్ని రీమేక్ చేస్తూ ఈ జంట తెరకెక్కబోతోంది.అయితే పెద్ద పెద్ద స్టార్స్ ప్రక్కన చేసిన శ్రియ ఇలా చిన్న హీరో ప్రక్కన చేయటానకి కారణం ఉందా అంటే..సక్సెస్ ఉంటేనే సినీ రంగంలో ఉంటాననే సంగతి నాకు బాగా తెలుసు. ఇక్కడ ఫెయిల్యూర్స్ వస్తే మళ్లీ మన మొహం చూడరనే సంగతి అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా.అందుకనే ఒప్పుకున్నాను.క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది అంది.
పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో నడిచే ఈ చిత్రంలో శర్వానంద్ కూడా నటిస్తున్నారు. నారాయణ దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందనున్న ఈ చిత్రాన్ని వంశీకృష్ణ నిర్మిస్తున్నారు. వైజాగ్ కి చెందిన వంశీ కృష్ణ ప్రస్తుతం నారా రోహిత్ తో సోలో చిత్రం చేస్తున్నారు. యువత ఫేమ్ పరుశరామ్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ లో ఉండగానే ఈ చిత్రాన్ని ఓకే చేసారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడవుతాయి.గమ్యంలో కూడా అల్లరి నరేష్, శర్వానంద్ నటించారు కాబట్టి ఈ చిత్రంపై మంచి క్రేజ్ వచ్చే అవకాశముందని బావిస్తున్నారు.