జులాయిగా తిరుగుతున్న రాజమౌళిని అస్కార్ రేంజ్ డైరెక్టర్ అయ్యేలా చేసిందెవరంటే?
రాజమౌళి ఇప్పుడు కేవలం తెలుగు డైరెక్టర్ మాత్రమే కాదు. ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న పాన్ వరల్డ్ రేంజ్ ఉన్న డైరెక్టర్ గా మారిపోయాడు. నిజానికి ఆయన ఇప్పుడంటే ఇలా ఉన్నాడు కానీ.. ఒకప్పుడు అందరి కుర్రాళ్ల లాగానే టైం పాస్ చేయడానికి ఇష్టపడుతూ ఉండేవాడట. అయితే ఒకరి మాటలు ఆయన మీద బాగా ప్రభావం చూపి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలు పెట్టేలా చేశాయని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
సీరియల్ డైరెక్టర్ గా : శాంతి నివాసం సీరియల్ తో దర్శకుడిగా కెరియర్ ప్రారంభించి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సినిమా డైరెక్టర్ గా మారాడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అనేక సినిమాలకు రచయితగా పనిచేశారు. కథలు అందించడమే కాదు కొన్ని సినిమాలకు డైలాగ్స్ కూడా అందించారు ఆయన. అయితే అలాంటి ఆయన కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రాజమౌళి ముందుగా సాగర్ అనే దర్శకుడు దగ్గర కొన్నాళ్లపాటు శిష్యరికం చేశారు.




శ్రీవల్లి తల్లిగానే : కానీ ఎప్పుడో కానీ డబ్బులు వచ్చేవి కాదని తన అన్న కీరవాణి పలువురు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేస్తూ వచ్చిన జీతంతోనే 13 మంది తిని ఉండే వాళ్ళమని చెప్పుకొచ్చాడు. ఇక తన వదిన శ్రీవల్లిని ఎప్పుడూ వదినా అని పిలవలేదని వయస్సు ఎక్కువే ఉండడంతో తల్లిగానే చూస్తూ ఉండేవారమని ఆయన అన్నాడు.

అయితే యుక్త వయసు వచ్చాక ఏమి పట్టించుకోకుండా అల్లరి చిల్లరగా తిరుగుతున్న నేపథ్యంలో తమ బంధువులు తనను సూటిపోటి మాటలతో వేధించేవారని ఒక రోజు ఇది గమనించిన శ్రీవల్లి దగ్గరకు పిలిచి నా కొడుకుని ఇలా అందరూ మాటలు అనడం నాకు నచ్చడం లేదని ఆవేదన వ్యక్తం చేసిందని... చెప్పుకొచ్చాడు. ఆవిడ మాటలు తన మీద ప్రభావం చూపి తాను ఏదో ఒకటి సాధించాలనే కసితో సీనిరంగంలో ప్రవేశించానని రాజమౌళి చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











