twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లారెన్స్ నిండా ముంచాడు : ‘రెబల్’ నిర్మాతల ఫిర్యాదు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : రెబల్ చిత్ర నిర్మాతలు జె భగవాన్, పుల్లారావు దర్శకుడు లారెన్స్ పై ఫైర్ అయ్యారు. లారెన్స్ రూ. 22 కోట్ల బడ్జెట్‌లో సినిమా పూర్తి చేస్తానని చెప్పి రూ. 45 కోట్లు ఖర్చు పెట్టించాడని, లారెన్స్ వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసారు. నిర్మాతల మండలి లారెన్స్‌పై నిషేదం విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

    కాగా...నిర్మాతలపై లారెన్స్ రివర్స్ అటాక్ మొదలు పెట్టారు. నిర్మాతలు తనకు డబ్బింగ్, రీమేక్ రైట్స్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసారని, వేరొకరికి అమ్ముకున్నారని మండి పడ్డారు. ఈ విషయమై ఆయన దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

    ఏది ఏమైనా....లారెన్స్ చేసిన ఘన కార్యానికి ఇటు నిర్మాతలు నిండా మునగడంతో పాటు, అటు ప్రభాస్ కెరీర్లో ప్లాపు సినిమా వచ్చి చేరింది. అయితే ఇప్పుడు తప్పు చేసామని బాధపడితే ఏం లాభం? సినిమా కమిట్ అయ్యే ముందే అన్ని విషయాలను గమనించాలి.

    ప్రభాస్, తమన్నా, దీక్షా సేథ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

    English summary
    
 Prabhas starrer Rebel producres complaint against Lawrence. And Producers' Council has taken up the issue. According to our sources, producers J Baghavan and Pullarao, in their written complaint alleged that Lawrence escalated the film's budget from Rs 22 Crores to Rs 45 Crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X