twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రెబల్’కు పోటీగా మనుషులను పీక్కుతినే మూవీ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్ చిత్రం ఎట్టకేలకు ఈనెల 28న విడుదల కానుంది. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించిన ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ యాక్షన్, తమన్నా, దీక్షా సేథ్ గ్లామర్ అభిమానులను మజా చేయనున్నాయి.

    నిర్మాతలు మాట్లాడుతూ హైటెక్నికల్ విలువలతో స్టయిలిష్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ఆదరణ పొందాయని, త్వరలో ప్లాటినమ్ డిస్క్ వేడుకలు జరుపనున్నామని, ఈ సందర్భంగా ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి చిత్రాన్ని ఈనెల 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

    మరో వైపు అదో రోజు హాలీవుడ్ మూవీ 'రెసిడెంట్ ఈవిల్-5' తెలుగులో విడుదలవుతోంది. కొలంబియా మూవీస్, ఆదేష్ ఫిలింస్ పతాకంపై కె.సదక్‌కుమార్, జి.మహేశ్వర్‌రెడ్డి ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ద్వారా తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అందిస్తున్నారు.

    నిర్మాతలు మాట్లాడుతూ చనిపోయిన మనిషి తిరిగి బతికి తోటి మనుషులను పీక్కుతినే క్రూరమృగంగా మారితే ఎలా వుంటుంది అన్న ప్రశ్నతో ఈ చిత్రం వుంటుందని, సన్నివేశాలు గగుర్భాటు కలిగేలా వుంటాయని, హారర్ జానర్‌లో ఇప్పటికే నాలుగు భాగాలు విజయవంతమయ్యాయని, ఐదవ భాగం కూడా విజయవంతమవుతుందన్న నమ్మకం వుందన్నారు.

    English summary
    Telugu action film 'Rebel' and Hollywood horror movie Resident Evil to be released on Sep 28. According to industry grapevine, it was speculated that the film release may be deferred due to Ganesha visarjan (immersion) Sep 29 and Telangana bandh on Sept 30.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X