Don't Miss!
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించేనా రామ్ గోపాల్ వర్మ అన్నది?
వివాదమే ఇంటిపేరుగా మార్చుకున్న వర్మ తాజాగా రెడ్డి గారు పోయారు అనే టైటిల్ ప్రకటించి సంచలనం రేపే ప్రయత్నం చేసారు. ఇది ఓ పొలిటకల్ డ్రామా అని ...ప్రస్తుత రాజకీయాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని చెప్పారు. అలాగే తాను ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ డ్రాఫ్ట్ స్క్రిప్టు పూర్తి చేసానని, ప్రి ప్రొడక్షన్ కి రెడీ అవుతున్నానని అన్నారు. దొంగలముఠా చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న నేఫద్యంలో ఆ టాపిక్ ని ఏమార్చటానకి ఈ టైటిల్ ని హడావిడిగా ప్రకటించాడా అని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజకీయాల నేఫధ్యంలో కుర్చీ , రాజకీయం అనే చిత్రాలు చేస్తానని వర్మ గతంలో ప్రకటించారు.
కానీ ఆ సినిమాలు ఏమీ ఇంకా మొదలపెట్టలేదు. అలాగే పూరీ జగన్నాధ్, హరీష్ శంకర్ లతో మరో ప్రక్క వాంటెడ్ చిత్రం దర్శకుడు బి.వియస్ రవి ని హీరోగా పెట్టి పెళ్ళి చిత్రం చేస్తున్నారు. ఇంతకీ రెడ్డిగారు పోయారు అంటే దానర్ధం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.యస్.రాజశేఖర్ రెడ్డి మరణించాక అనేనే కాదా అన్నది అన్ని వర్గాల్లోనూ ఆసక్తి రేగుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల చుట్టూనే ఈ కథ జరుగుతుందా అనేది అన్ని వర్గాల్లోనూ అప్పడే ఛానెల్స్ వారు చర్చమెదలెట్టాసారు.