Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దారుణం : నటి సౌందర్య స్థలం కబ్జా
బెంగళూరు : ప్రమాదంలో మృతి చెందిన నటి సౌందర్య స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి విక్రయించేందుకు నిందితులతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలపై బెంగళూరు సహకార సంఘాల విశ్రాంత రిజిస్ట్రార్ తిమ్మయ్యను లోకాయుక్త పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కుంభకోణంలో నిందితులతో చేతులు కలిపిన సహకార సంఘం కార్యదర్శి దయానంద్, మరో నలుగురు కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. బనశంకరి రెండో స్టేజ్లోని జి.ఎస్.అసోసియేట్స్ పేరిట దయానంద్ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడని పోలీసులు గుర్తించారు.
సౌందర్య 1999 జూన్లో ఒక స్థలాన్ని కొనుగోలు చేశారు. అక్కడ ఇంటిని నిర్మించే ప్రయత్నాల్లో ఉండగానే విమాన ప్రయాణంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో సౌందర్య భర్త ఆ స్థలాన్ని సిద్ధమ్మ అనే మహిళకు విక్రయించారు.
అయితే తిమ్మయ్య, దయానంద్, మరో నలుగురు నిందితులు ఆ స్థలానికి నకిలీ పత్రాలను సృష్టించి భాగ్యలక్ష్మి అనే మహిళకు విక్రయించారు. భాగ్యలక్ష్మి ఆ స్థలాన్ని 2015లో నాగరత్న అనే మహిళకు విక్రయించింది.
ఈ విషయాన్ని గుర్తించిన సిద్ధమ్మ తన స్థలం కబ్జాకు గురైందని సౌందర్య భర్త రఘుకు తెలిపింది. రఘు, సిద్ధమ్మలు కలిసి లోకాయుక్తకు ఫిర్యాదు చేయటంతో అక్రమ వ్యహహారం వెలుగు చూసింది.. ప్రాథమిక దర్యాప్తు తరువాత తిమ్మయ్యను అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు.