మహిళలను బ్యాడ్గా... నిర్మాత ఏక్తాకపూర్కు సమన్లు
కమీషన్ చైర్ పర్సన్ మమతా శర్మ మాట్లాడుతూ 'ఏక్తాకపూర్ నిర్మించిన ఏక్ థి దాయన్ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇప్పితా రాయ్ చక్రవర్తి కంప్లంట్ చేసారు. ఈ మేరకు మేము ఏక్తాకు నోటీసులు జారీ చేసాము. ఏప్రిల్ 9వ తేదీన కమీషన్ ముందు హాజరవ్వాల్సిందిగా కోరాము' అని తెలిపారు.
'ఇటీవల విడుదలైన ఈచిత్రం ట్రైలర్లో క్షుద్ర విద్యలాంటి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అవి సమాజానికి ఉపయోగకరంగా ఉంటాయని మాత్రం అనుకోవడం లేదు. ఈ తరం వారికి క్ష్రుద్రవిద్యలు తెలియవు. అలాంటి వాటి గురించి వారికి నేర్పాల్సిన అవసరం కూడా లేదు, ఇలాంటివి సమాజానికి అంత మంచి పరిణామాలు కాదు' అని మమతా శర్మ వ్యాఖ్యానించారు.
సినిమాలో మహిళలను క్షుద్రపూజలు చేసే వారిగా చూపడంతో కోల్కతాకు చెందిన సామాజిక కార్యకర్త ఇప్సితారాయ్ చక్రవర్తి 'ఏక్ థి దాయన్' చిత్ర నిర్మాణ సంస్థ బాలాజీ టెలి ఫిల్మ్స్ సంస్థపై జాతీయ మహిళా కమీషన్కు ఫిర్యాదు చేసారు. ఈ కంప్లైంట్పై ఏక్తా కపూర్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ చిత్రాన్ని మఖేష్ శర్మ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాలో నటిస్తున్న కొంకణ సేన్ తండ్రే ఈ ముఖేష్ శర్మ.


Click it and Unblock the Notifications












