సాయి ధరమ్ తేజ్ సినిమా విడుదల తేది ఖరారు !
సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా ప్రేమకథ చిత్రాల దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కిస్తున్న చిత్రం 'తేజ్ ఐ లవ్ యూ'. ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. కె వల్లభ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను కరుణాకరన్ తనదైన శైలిలో ఫీడ్ గుడ్ మూవీ గా తెరకెక్కించడం జరిగిందని సమాచారం. డైరెక్టర్ కరుణాకరన్ కి హీరో సాయి ధరమ్ తేజ్ కు ఈ సినిమా కీలకంగా మారింది. వీరిద్దరి భవిషత్తు 'తేజ్ ఐ లవ్ యు' సినిమాపైనే ఆధారపడి ఉంది.
హీరో సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా ప్రేమకథ చిత్రాల దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కిస్తున్న చిత్రం 'తేజ్ ఐ లవ్ యూ'. ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ చూసిన చాలా మంది బాగుందని మెచ్చుకోవడం జరిగింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తేజ్ ఐ లవ్ యు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇటీవలే పారిస్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న తేజ్ ఐ లవ్ యు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. పారిస్ షెడ్యూల్ లో సాయి ధరమ్ తేజ్ , అనుపమ పరమేశ్వరన్ మీద ఒక పాటను, కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. జూన్ 29న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.
ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. కె వల్లభ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను కరుణాకరన్ తనదైన శైలిలో ఫీడ్ గుడ్ మూవీ గా తెరకెక్కించడం జరిగిందని సమాచారం. డైరెక్టర్ కరుణాకరన్ కి హీరో సాయి ధరమ్ తేజ్ కు ఈ సినిమా కీలకంగా మారింది. వీరిద్దరి భవిషత్తు 'తేజ్ ఐ లవ్ యు' సినిమాపైనే ఆధారపడి ఉంది.


Click it and Unblock the Notifications











