Don't Miss!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దయచేసి వాటిని ఫాలో అవ్వకండి.. స్టుపిడ్ అంటూ రేణూ దేశాయ్ ఫైర్
రేణూ దేశాయ్పై ఎప్పుడూ ఏదో ఒక రకమైన వార్త వస్తూనే ఉంటాయి. కొందరు పనిగట్టుకుని మరీ రేణూ దేశాయ్ను టార్గెట్ చేసినట్టుగానే ఉంటాయి. అలా తన రూమర్లు, ఫేక్ వార్తలు వచ్చిన ప్రతీ సారి రేణూ దేశాయ్ ఖండిస్తూనే వస్తుంది. ప్రతీసారి మీడియాకు విన్నవించుకుంటూనే ఉంటుంది. తప్పుడు వార్తలు రాయకండి రేణూ దేశాయ్ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటుంది. తాజాగా రేణూ దేశాయ్ మాత్రం ఓ మీడియా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్..
సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ ఎంత యాక్టివ్గా ఉంటుందో అందరికీ తెలిసిందే. సమాజంలో జరిగే దురాగతాలపై స్పందిస్తూ ఉంటుంది. మహిళలపై అఘాయిత్యాలను ఖండిస్తూ ఉంటుంది. తనపై వచ్చే వార్తలు, రూమర్లను కూడా ఓ కంట గమనిస్తూనే ఉంటుంది. తప్పుడు వార్తలపై రేణూ దేశాయ్ కన్నెర్ర చేస్తుంది.
ఆ మధ్య అలా..
ఆ మధ్య రేణూ దేశాయ్, పిల్లల కోసం పవన్ కళ్యాణ్ ఓ లగ్జరీ ఇల్లు కొనిచ్చాడంటూ వార్తలు వచ్చాయి. కానీ వాస్తవంగా రేణూ దేశాయ్ తన ప్రాజెక్ట్ల కోసం హైద్రాబాద్కు షిప్ట్ అయింది. తన సొంత డబ్బులతో ఇళ్లు కొనుక్కున్నా కూడా కొన్ని మీడియా సంస్థలు మాత్రం పవన్ కళ్యాన్ గిఫ్ట్గా ఇచ్చాడంటూ రాశారు. వాటిపై రేణూ దేశాయ్ ఓ రేంజ్లో ఫైర్ అయింది. సుధీర్ఠమైన ప్రకటనను విడుదల చేస్తూ తన ఆవేదనను వెల్లిబుచ్చికుంది.
నాగ్ హీరోయిన్ అందాల ఆరబోత.. మళ్లీ తెరపైన మెరిసిన తార
ఇప్పుడు ఇలా..
తాజాగా రేణూ దేశాయ్పై మరో రూమర్ బయటకు వచ్చింది. రేణూ దేశాయ్కి కరోనా సోకిందంటూ పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చిందటూ ఓ మీడియా కథనాన్ని ప్రచురించింది. దానికి అనుగుణంగా ఓ హాస్పిటల్ రిపోర్ట్ను కూడా జోడించింది. అలా తనకు కరోనా పాజిటివ్ అని తప్పుడు వార్తలను ప్రచురించడంపై రేణూ దేశాయ్ మండిపడింది.
స్టుపిడ్ వెబ్ సైట్..
కరోనా పాజిటివ్ అంటూ రాసిన వెబ్ సైట్ను ఉద్దేశిస్తూ రేణూ దేశాయ్ ఓ పోస్ట్ చేసింది. స్టుపిడ్ వెబ్ సైట్స్, వాటి ట్విట్టర్ హ్యాండిల్స్ ఫాలో అవ్వడం ఆపేయండి.. ఇదే నా సిన్సియర్ రిక్వెస్ట్..ఇలాంటి స్టుపిడ్స్ కేవలం అబద్దాలు, తప్పుడు వార్తల మీదే బతుకుతుంటారు.. సెలెబ్రిటీలకు వెరిఫైడ్ ఖాతాలుంటాయి.. వాటినే ఫాలో అవ్వండి.. వాటినే నమ్మండి.. అంటూ రేణూ దేశాయ్ ఫైర్ అయింది.
శృంగారం ఒలకబోస్తున్న యువ హీరోయిన్.. లేటేస్ట్ ఫోటోషూట్తో హంగామా
మేం నేరుగా చెప్పుకోవడానికి..
వెరిఫై కానీ వాటిని నమ్మకండి.. ఇది నా ఒక్కరి విషయంలోనే చెప్పడం లేదు.. సినిమా పరిశ్రమకు చెందిన సెలెబ్రిటీల అందరి గురించి చెబుతున్నాను.. మీతో నేరుగా మా అభిప్రాయాలను, విషయాలను పంచుకోవడానికి మాకు వెరిఫైడ్ ఖాతాలున్నాయని రేణూ దేశాయ్ తప్పుడు వార్తలు రాసే వారికి చురకలు అంటించింది.