పవన్ కల్యాణ్ మాజీ భార్య సహా కుమారుడికి కరోనా..ఇంట్లోనే ఉన్నా, సీరియస్గా తీసుకోండి అంటూ!
అకస్మాత్తుగా, దేశంలో COVID-19 కేసులు మరోసారి పెరుగుతున్నాయి. గత కొన్ని వారాలుగా, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. చాలా మంది సెలబ్రిటీలకు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవుతోంది. ఇప్పుడు, మాజీ నటి మరియు పవన్ కళ్యాణ్ మాజీ భార్య, రేణు దేశాయ్ కూడా COVID-19 బారిన పడ్డారు. ఆమె మాత్రమే కాదు, ఆమె కుమారుడు అకీరా నందన్ కూడా వైరస్ బారిన పడ్డారు. ఆ వివరాలు
Recommended Video

కరోనా బారిన
గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా విజృంభిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినీ పరిశ్రమను కరోనా ఏమాత్రం వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే మహేష్ బాబు, రాజేంద్రప్రసాద్, మంచు లక్ష్మి, మంచు మనోజ్, త్రిష, సత్యరాజ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్.. నటి రేణు దేశాయ్ కరోనా బారిన పడ్డారు.

మాస్కులు ధరించండి
ఈ విషయాన్ని రేణు తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రకటించింది, అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉన్నప్పటికీ నేను, అకీరా కరోనా బారిన పడ్డాం, కొన్ని రోజులుగా లక్షణాలు కనిపించగా.. పరీక్షలు చేస్తే కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం మేం కోలుకుంటున్నాం, నేను ఇప్పటికే రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నాను.. అయినప్పటికీ కరోనా వచ్చింది. అకీరాకు వ్యాక్సిన్ వేయిద్దాం అనుకునే లోపే అతనికి కూడా కరోనా వచ్చింది. థర్డ్ వేవ్ ను సీరియస్ గా తీసుకుని మాస్కులు ధరించండి. జాగ్రత్తగా ఉండండి అంటూ రేణూ దేశాయ్ పోస్ట్ చేశారు.

వృద్ధాప్య సమస్యల కారణంగా
ఈ మహమ్మారి దావానంలా వ్యాపించడంతో, ఇటీవలి కాలంలో వైరస్ బారిన పడుతున్న సెలబ్రిటీల జాబితా పెరుగుతోంది. అంతకు ముందు రోజు, ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కోవిడ్ 19 బారిన పడి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ICU)లో చికిత్స పొందుతున్నారు. ఆమెకు తేలికపాటి లక్షణాలు ఉన్నాయని ఆమె మేనకోడలు రచన వెల్లడించారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆమెను ఐసీయూకి తరలించారు.

ఆమె కోసం ప్రార్థనలు చేయండి
గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యంపై అప్డేట్ ఇస్తూ, ఆమె మేనకోడలు రచన ANIతో మాట్లాడుతూ, "ఆమె బాగానే ఉంది; ఆమె వయస్సును దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త కారణాల వల్ల మాత్రమే ICUలో ఉంచబడింది. దయచేసి గోప్యతను గౌరవించండి, ఆమె కోసం ప్రార్థనలు చేయండి అని కోరారు.

రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు
రేణు దేశాయ్ నటిగా కంటే పవన్ కళ్యాణ్ రెండో భార్యగానే అందరికీ పరిచయం. 2011లో పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలు అకిరా నందన్, ఆద్యతో కలిసి ఆమె పూణెలో నివాసం ఉంటోంది. రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్తో నేరుగా కలవకపోయినా.. తన పిల్లలను పవన్ కళ్యాణ్కు మాత్రం దూరం చేయలేదు. గత కొన్నేళ్లుగా మెగా ఫ్యామిలీలో జరిగే ప్రతి ఫంక్షన్లో వీళ్లు పవన్ కళ్యాణ్తో కలిసి సందడి చేస్తూనే ఉన్నారు. ఆ మధ్య రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి సంచలనం రేపగా ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











