Don't Miss!
- News కడపలో వైఎస్ షర్మిలకు ప్లస్ గా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ లేఖాస్త్రం!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విసుగెత్తి రేణు దేశాయి...పవన్ ఫ్యాన్స్ కి సూటి ప్రశ్న
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయి ఇప్పుడు మరాఠీలో విజయవంతమైన నిర్మాతగా కొనసాగుతున్నారు. ఆమె ఈ మధ్యనే సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లోకి వచ్చి ఏక్టివ్ గా ఉంటున్నారు. తన మాజీ భర్త పవన్ కల్యాణ్ గురించి ఆమె తన మనస్సులోని అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కొన్ని ఎవరికీ తెలియని విషయాలను సైతం ఆమె గుర్తు చేసుకుంటున్నారు. అయితే కొందరు పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆమెను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవద్దంటూ కామెంట్ చేయటం ఆమెను చిరాకు తెప్పిస్తోంది. ఈ విషయమై ఆమె ఆవేదనతో పోస్ట్ చేసారు.
"ఓకే...నేను ఎందుకు హఠాత్తుగా మాట్లాడుతున్నాను అనే గురించి చెప్తున్నాను....నేను గత నాలుగు సంవత్సరాలుగా సైలెంట్ గా ఉన్నాను, అందరూ నేను మాట్లాడాలని, సైలెంట్ గా ఉండటం పద్దతి కాదన్నారు. దాంతో ఇప్పుడు నా శ్రేయాభిలాషులు, అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూంటే ఎందుకు హఠాత్తుగా మాట్లాడుతున్నావు అని ఆశ్చర్యపోతున్నారు. నేను సైలెంట్ గా ఉన్నా సమస్య. నేను మాట్లాడినా సమస్యే...నేను రాజకీయాలకు సంభంధం లేని కొన్ని నా ఆలోచనలు పంచుకోవటం స్వార్ధం అవుతుంది ..?," అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు.
పెళ్లి చేసుకోకుండానే ఎంతో సంతోషంగా సహ జీవనం సాగిస్తున్న పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ 2009లో పెళ్లాడారు. చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించడంతో పవన్-రేణు సంబంధంపై విమర్శలు వచ్చాయి. దీంతో సింపుల్గా పెళ్లి చేసుకున్నారు. నటిగా కెరీర్కు ముగింపు చెప్పిన తర్వాత ఆమె పవన్ నటించిన ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేసారు.
రేణు దేశాయ్ నిర్మాతగా మారి 'మంగలాష్ తక్ వన్స్ మోర్' అనే మరాఠీ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈచిత్రం విడుదలైంది. సమీర్ జోషి దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈచిత్రంలో స్వప్నిల్ జోషి, ముక్తా బార్వే, సాయి తమ్హాంకర్ ముఖ్య పాత్రలు పోషించారు.