Don't Miss!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
నా ముఖంలో బాధ అందుకే, కానీ కాదనలేకపోయా: రేణు దేశాయ్
ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చర్చనీయాంశం అయింది.
ప్రస్తుతం చాలా చోట్ల డెంగీ, విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. దోమలకు సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా ఉండదు... అందరిపైనా తమ ప్రతాపం చూపిస్తుంటాయి. ఇటీవల సాహో డైరెక్టర్ సుజీత్ కూడా డెంగీ బారిన పడ్డ సంగతి తెలిసిందే. రేణు దేశాయ్ కుడా ఇపుడు ఈ బాధితుల లిస్టులో చేరిపోయారు.
డెంగీ బారిన పడిన రేణు దేశాయ్
రేణు దేశాయ్ డెంగీ బారిన పడ్డారు. కొన్ని రోజులుగా దీనికి చికిత్స తీసుకుంటున్న ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా వెల్లడించారు. అయితే ఇంకా పూర్తిగా కోలుకోకుండానే ఓ టీవీ షోలో పాల్గొనాల్సి వచ్చిందట.
|
నా ముఖంలో బాధ ఉంది, కానీ కాదనలేక పోయా
‘‘నా ముఖం చూశారుగా... అందులో బాధ కనిపించడానికి కారణం డెంగీ. కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నాను. కోలుకుంటున్న సమయంలో ఢీ చాంపియన్స్ రియాలిటీ షోలో పాల్గొనాల్సి వచ్చింది. కొన్ని గంటలే షూటింగ్ కావడంతో కదనలేక పోయాను.'' అని రేణు దేశాయ్ ఓ సెల్ఫీ పిక్ పోస్ట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
దోమల విషయంలో జాగ్రత్త
‘‘దోమలతో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. దోమల నుంచి కాపాడుకోవడానికి క్రీములు రాసుకోవడంతో పాటు, ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులు ధరించండి. దోమకాటుకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి'' అని రేణు దేశాయ్ పేర్కొన్నారు.
హైదరాబాద్ షిప్ట్ అవుతున్న రేణు దేశాయ్
2017లో స్టార్ మా టీవీలో 'నీతోనే డాన్స్' అనే కార్యక్రమానికి జడ్జిగా చేసినప్పటి నుంచి తెలుగులో రేణు దేశాయ్కు చాలా ఆఫర్లు వస్తూనే ఉన్నాయని, దీంతో పాటు రైతుల గురించి టాలీవుడ్లో ఓ సినిమా చేసే ఆలోచనలో ఆమె ఉన్నారు. అందుకే హైదరాబాద్ షిప్ట్ అవ్వాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.