మీకు ఏది ముఖ్యం? అంటూ ప్రశ్నించిన రేణు దేశాయ్
హైదరాబాద్: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ..... సమాజంలో, దేశంలో జరుగుతున్న సంఘటనలపై తనదైన రీతిలో స్పందించే రేణు దేశాయ్ తాజాగా పంజాబ్ లోని గుర్దాస్పూర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిపై కూడా స్పందించారు.
నేషనాలిటీ కంటే మీ మతమే గొప్పదా? మానవత్వం కంటే మీ మతం, నేషనాలిటీ అంత గొప్పవా? ఒక వేళ కాదు అయితే....ఇపుడు మనమంతా ఒకరినొకరం ఎందుకు ద్వేషించుకుంటున్నాం? చంపుకుంటున్నాం? దేని కోసం? అంటూ ఆమె ట్వీట్ చేసారు.
ఆ సంగతి పక్కన పెడితే...
నేను మళ్లీ ప్రేమలో పడను. ఈ విషయం నన్ను ఎన్నిసార్లు అడిగినా ‘ప్రేమలో పడను పడను' అనే చెబుతాను............ అంటూ రేణు దేశాయ్ గతంలో చేసిన ట్వీట్ తన ట్విట్టర్ పేజీలో టాప్ లో పిన్ చేసి పెట్టడం గమనార్హం.


Click it and Unblock the Notifications











