బాగా పెరిగిన రాణూ పొగరు! ఏయ్ టచ్ చేయకు అంటూ నానా హంగామా.. నెట్టింట వైరల్ వీడియో
Recommended Video
రైల్వే స్టేషన్లో కాలక్షేపానికి పాటలు పాడుకునే యువతి బాలీవుడ్ సింగర్గా ఎదిగింది. ఆమె గాత్రం చూసి దేశ ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఆమె నోటివెంట వచ్చిన ఆ పాట దేశమంతటా సెన్సేషన్ అయింది. దీంతో ఆమెకు డిమాండ్ కూడా పెరిగింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఆమెకు డిమాండ్తో పాటు పొగరు కూడా పెరడగం ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేసే వరకు వచ్చేసింది. ఆ వివరాలేంటో పూర్తిగా చూద్దామా..

రైల్వే స్టేషన్లో అలా.. ఇప్పుడు మాత్రం
రేణూ మోండల్.. ఈ మధ్యనే బాగా పాపులర్ అయిన పేరిది. రైల్వే స్టేషన్లో పాటలు పడుకునే ఈమెకు ఉన్నటుండి మహర్దశ పట్టింది. సోషల్ మీడియా కారణంగా ఈమె టాలెంట్ బాలీవుడ్ సినీ పరిశ్రమను తాకింది. బాలీవుడ్లో పాట పాడే అవకాశం ఆమెను సెలెబ్రిటీ చేసేసింది.

కోపం తెప్పించేలా బిహేవియర్
పశ్చిమ బెంగాల్లోని రణఘాట్ రైల్వే స్టేషన్లో ఆమె 'ఏక్ ప్యార్ కా నగ్మా హై' అనే పాట పాడుకుంటూ ఉండగా.. ఆ పాటను వీడియో తీసి ఒకరు సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త వైరల్ అయి ఆమెకు బాలీవుడ్లో అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆమె డిమాండ్ పెరిగి సెలబ్రిటీ అయిపోయింది. అయితే ఈ పరిస్థితుల్లో ఆమె ఫీల్ అవుతున్న తీరు నెటిజన్లకు కోపం తెప్పిస్తోంది.

ఏయ్ టచ్ చేయకు అంటూ సెన్సేషన్
ఇటీవల ఓ షాపింగ్ మాల్లో ఆమె ప్రవర్తించిన తీరు చూసి ఆశ్చర్యపోయారు అక్కన్న వారంతా. ముంబయిలోని ఓ షాపింగ్ మాల్ లో రేణూ మోండల్ ను చూసిన ఓ మహిళ ఆమెతో సెల్ఫీ దిగాలని కోరింది. ఈ నేపథ్యంలో ఆమె భుజంపై చెయ్యి వేసి పిలిచింది. దీంతో రేణూ మోండల్ రియాక్ట్ అయిన తీరు ఒక్కసారిగా అందరికీ షాకిచ్చింది.
This is what happens when people don't know to handle the instant name and fame they get! pic.twitter.com/7tRk1WHTsL — Mahesh Vikram Hegde (@mvmeet) November 4, 2019 '>
భుజంపై చెయ్యి వేయగానే.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో
తన భుజంపై చెయ్యి ఎందుకు వేస్తున్నావంటూ ప్రశ్నించడమే గాక.. తానిప్పుడు సెలబ్రిటీనని దూరంగా ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆమె తీరును తప్పుబడుతూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. పాత రోజులు మరిచి ఇలా ప్రవర్తించడం సరికాదంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











