Don't Miss!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- News వైసీపీలోకి జనసేన మఖ్య నేతలు - పిఠాపురం పై గురి..!!
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
కాపీకి..మహాత్మ కౌంటర్
జనంలోంచి పుట్టిందే జాన పదమని, పల్లెప్రజలు నాట్లు వేసు కుంటూ, వరికోతల సమ యం లో పాడుకునే పాటను తన పాట గా చెప్పుకోవడం అవుదుర్తి లక్ష్మ ణ్కు తగదని 'మహాత్మ' గేయ రచయిత కాసర్ల శ్యాం అన్నారు.
'మహాత్మ సినిమా వారు నా పాటను దొంగిలించారు. 2005 నుంచి బహుళ జనాదరణ పొందిన నా పాటను ఇష్టారీతిగా వాడుకున్నారు. ఇటీవల విడుదల చేసిన పాటల సీడీలో రచయిత పేరు ముద్రించకుండా పాట వాడు కోవడం వారి చర్యను నిర్ధారిస్తున్నదని ప్రముఖ జానపద గాయకుడు, రచయిత అవుదుర్తి లక్ష్మణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దానికి కౌంటర్ గా 'మహాత్మ' గేయ రచయిత కాసర్ల శ్యాం సమాదానిచ్చారు. ఇక మగధీర సమయంలోనూ వంగపండు తన పాటను వాడుకున్నారంటూ మగధీర నిర్మాతపై దండెత్తిన సంగతి తెలిసందే.
ఇక శ్రీకాంత్, కృష్ణవంశి కాంబినేషన్లో వస్తున్న ఈ మహాత్మ చిత్రం సెన్సార్ పరంగా ఇప్పటికే చిక్కులను ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఈ కొత్త వివాదం తోడయ్యంది.