80'స్ రీ యూనియన్: ఈ సారి కూడా చిరంజీవి, బాలయ్య మిస్సయ్యారు.... (ఫోటోస్)
Recommended Video

1980ల్లోని సౌత్ హీరోలు, హీరోయిన్లు ప్రతి సంవత్సరం రీ యూనియన్ అవుతూ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన స్టార్స్ ఈ రీ యూనియన్లో పాల్గొంటూ వస్తున్నారు.
తాజాగా 9వ రీయూనియన్ జరిగింది. ఇటీవల చెన్నై టినగర్లోని ఓ ప్రైవేట్ రెసిడెన్స్లో 22 మంది స్టార్స్ రీ యూనియన్ పార్టీలో పాల్గొన్నారు. ఈ సారి డెనిమ్స్ అండ్ డైమండ్ థీమ్తో ఈ రీ యూనియన్ పార్టీ జరిగింది.

చిరంజీవి, బాలయ్య మిస్
గతంలో ఓ సారి జరిగిన రీ యూనియన్లో తెలుగు సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య కూడా పాల్గొన్నారు. అయితే గతేడాదితో పాటు ఈ సారి కూడా ఈ ఇద్దరు స్టార్లు మిస్ అయ్యారు. చిరంజీవి సైరా షూటింగులో బిజీగా ఉండటం, బాలయ్య రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల రాలేదని తెలుస్తోంది.

నదియా, సుహాసిని, ఖుష్భూ
ఈ సారి రీ యూనియన్లో 80'స్ హీరోయిన్లు నదియా, ఖుష్బూ, రాధ, పూర్ణిమ, లిజీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మోహన్ లాల్, అర్జున్, సత్యరాజ్, నరేష్
సౌత్ స్టార్స్ మోహన్ లాల్, సత్యరాజ్, అర్జున్, భాగ్యరాజ్, భాను చందర్, శరత్ కుమార్, నరేష్, సుమన్ తదితరులు ఈ 9వ 80'స్ రీ యూనియన్లో భాగం అయ్యారు.

బాలీవుడ్ నుండి జాకీ ష్రాఫ్
ఈ సారీ యూనియన్ పార్టీలో బాలీవుడ్ నుంచి 80'స్ స్టార్ జాకీ ష్రాఫ్తో పాటు.... ఆయన సతీమణి కూడా పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











