'శ్రీరామరాజ్యం'నిర్మాత కుమారుడు లాంచింగ్ చిత్రం

అయితే ఈ కథా వస్తువులో అన్నమయ్య కీర్తనలు, ఆయన నెలకొల్పిన సంగీత సంప్రదాయాల్ని ఎలా మేళవించారన్నది సస్పెన్స్ అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తారు. త్వరలో తిరుపతిలో సంగీత చర్చలు మొదలవుతాయి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు చోటుంది. ఒక నాయికగా 'జర్నీ'లో నటించిన అనన్యను ఎంచుకొన్నారు. ఎస్.గోపాలరెడ్డి ఛాయాగ్రహణం అందిస్తారు.
'అన్నమయ్య' నుంచి దర్శకులు కె.రాఘవేంద్రరావు భక్తి భావ చిత్రాల రూపకల్పనలో తనదైన ముద్రను చూపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు 'శిరిడి సాయి'ని సిద్ధం చేస్తున్నారు. ఆ తరవాత 'ఇంటింటా అన్నమయ్య' అనే చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తారని విశ్వసనీయ సమాచారం. విజయ దశమి రోజున ఈ చిత్రానికి శ్రీకారం చుడతారు. 'శ్రీరామరాజ్యం' తీసిన యలమంచిలి సాయిబాబు నిర్మాత.


Click it and Unblock the Notifications











