Don't Miss!
- News రుణమాఫీపై రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నా: హరీష్ రావు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
ఈ సారి ఆ హీరోతో 'రంగీళా' తీయనున్న రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ 1995 లో ఊర్మిళ, అమీర్ ఖాన్,జాకీ షరాఫ్ లతో రంగీళా చిత్రాన్ని తీసి సూపర్ హిట్ ఇచ్చారు. అయితే ఇన్నాళ్ళకు మళ్ళీ అదే కాన్సెప్టు తరహా చిత్రాన్ని రూపొందించాలనే కోరిక ఆయనలో బయిలుదేరింది. అయితే హీరోగా ఈ సారి రణబీర్ కపూర్ ని ఎన్నుకున్నారు. ప్రస్తుతం రణబీర్..బాలీవుడ్ కి కలల రాకుమారుడు. దాంతో అతని క్రేజ్, తన మేకింగ్ తో ఓ కొత్త సంచలనానికి తెరతీయవచ్చునని ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే వర్మ మీడియాతో ఈ విషయాలను చర్చించలేదు. నేను, రణబీర్ ఏ ప్రాజెక్టులు చేయగలమో అన్న విషయాలపై చర్చించాం అంతే అని తప్పుకున్నారు. ఇక వర్మ ప్రస్తుతం పరిటాల రవి జీవిత చరిత్రగా చెపుతూ రక్త చరిత్ర అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే మీడియాపై తీసిన రణ్ చిత్రం సైతం రిలీజ్ కు రెడీగా ఉంది. వీటితో పాటు తన శిష్యుడు మిలింగ్ గడసాక్కర్ దర్శకత్వంలో ఫూంక్ చిత్రం సీక్వెల్ చేస్తున్నారు.