Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఈ సారి ఆ హీరోతో 'రంగీళా' తీయనున్న రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ 1995 లో ఊర్మిళ, అమీర్ ఖాన్,జాకీ షరాఫ్ లతో రంగీళా చిత్రాన్ని తీసి సూపర్ హిట్ ఇచ్చారు. అయితే ఇన్నాళ్ళకు మళ్ళీ అదే కాన్సెప్టు తరహా చిత్రాన్ని రూపొందించాలనే కోరిక ఆయనలో బయిలుదేరింది. అయితే హీరోగా ఈ సారి రణబీర్ కపూర్ ని ఎన్నుకున్నారు. ప్రస్తుతం రణబీర్..బాలీవుడ్ కి కలల రాకుమారుడు. దాంతో అతని క్రేజ్, తన మేకింగ్ తో ఓ కొత్త సంచలనానికి తెరతీయవచ్చునని ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే వర్మ మీడియాతో ఈ విషయాలను చర్చించలేదు. నేను, రణబీర్ ఏ ప్రాజెక్టులు చేయగలమో అన్న విషయాలపై చర్చించాం అంతే అని తప్పుకున్నారు. ఇక వర్మ ప్రస్తుతం పరిటాల రవి జీవిత చరిత్రగా చెపుతూ రక్త చరిత్ర అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే మీడియాపై తీసిన రణ్ చిత్రం సైతం రిలీజ్ కు రెడీగా ఉంది. వీటితో పాటు తన శిష్యుడు మిలింగ్ గడసాక్కర్ దర్శకత్వంలో ఫూంక్ చిత్రం సీక్వెల్ చేస్తున్నారు.