Don't Miss!
- News కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
లక్ష్మీస్ ఎన్టీఆర్: బాలయ్యను పాజిటివ్గా చూపించారా? జూ ఎన్టీఆర్ ఫోన్ చేశారా?
'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విషయంలో రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో బాలయ్యను పాజిటివ్గా చూపిస్తున్నారని, హరికృష్ణను నెగెటివ్గా చూపిస్తున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. దీనిపై చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి స్పందించారు. అప్పట్లో బాలయ్య పాజిటివ్గా ఉన్నారేమో? ఆరోజు బాలయ్య ఎలా ఉంటే అదే సినిమాలో ఉంటుంది అన్నారు.
హరికృష్ణ గురించి నెగెటివ్గా చూపించాల్సిన అవసరం మాకు ఏమీ లేదు, మాకేమీ ఆయన శతృవు కాదని రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ రోజు ఏం జరిగింది? అనే నిజా నిజాలు మాత్రమే సినిమాలో చూపించబోతున్నాం. చూసిన తర్వాత అది నిజమా? కాదా? అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.
లక్ష్మీ పార్వతిని పురంధరేశ్వరి కొట్టారా?
ఇటీవల విడుదలైన ట్రైలర్లో ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన ఓ లేడీ లక్ష్మీ పార్వతిని కొట్టినట్లు చూపించారు. ఆమె పురంధరేశ్వరి అనే రూమర్స్ వచ్చిన నేపథ్యంలో రాకేష్ రెడ్డి స్పందిస్తూ... చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఈ రూమర్స్లో నిజం ఎంత? అనేది సినిమా చూసిన తర్వాతే తెలుస్తుంది. ఆమె ఎవరు? అనేది ఇప్పుడే చెబితే ప్రేక్షకులు సస్పెన్స్ మిస్సవుతారని రాకేష్ రెడ్డి తెలిపారు.
మనుషులను బట్టి క్యారెక్టర్లు మారిస్తే అసలు కథ ఎలా అవుతుంది?
ఇపుడు పురంధరేశ్వరి వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో... సినిమాలోని కొన్ని సన్నివేశాలు మారుస్తున్నారని, అందుకే ఎక్కవ సమయం తీసుకున్నారనే వార్తలపై రాకేష్ రెడ్డి రియాక్ట్ అవుతూ... ఇలాంటి రూమర్స్ చాలా వస్తున్నాయి. మా సినిమాకు, పురంధరేశ్వరికి సంబంధం లేదు. మనుషులను బట్టి క్యారెక్టర్లు మారిస్తే అసలు కథ ఎలా అవుతుంది? ఆ రోజు ఏం జరిగిందో అది మాత్రమే సినిమాలో ఉంటుంది. సినిమాలో నిజం ఉందనే నమ్మకం ఉంది కాబట్టే టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు.
శ్రీదేవి ఉంటే కన్నీళ్లు పెట్టుకునేది... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' వివాదంపై భగ్గుమన్న ఆర్ నారాయణ మూర్తి
జూ ఎన్టీఆర్ ఫోన్ చేశారా?
హరికృష్ణ నెగెటివ్ రోల్ ఉన్నట్లు ట్రైలర్లో చూపించారు కాబట్టి జూ ఎన్టీఆర్ నుంచి కానీ, ఇంకెవరి నుంచైనా కానీ ఫోన్లు వచ్చాయా? అనే ప్రశ్నకు రాకేష్ రెడ్డి రియాక్ట్ అవుతూ.... మాకు వారి నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని తెలిపారు.
లక్ష్మి పార్వతి నమ్మకంగా ఉన్నారు
సినిమా ద్వారా నిజాలు బయటకు వస్తే... నా మీద ఉన్న తప్పుడు ప్రచారం అబద్దమనే విషయం ప్రజలకు తెలుస్తుందనే నమ్మకంతో లక్ష్మీపార్వతి ఉన్నమాట వాస్తవమే. ఈ సినిమా వస్తే నాకు మనశ్శాంతి లభిస్తుంది, రామారావుగారి ఆత్మ శాంతిస్తుందని ఆమె చాలా సార్లు చెప్పినట్లు రాకేష్ రెడ్డి తెలిపారు.