Don't Miss!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'పెళ్ళి' టైటిల్ రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం
రామ్ గోపాల్ వర్మ త్వరలో తాను 'పెళ్ళి' టైటిల్ తో ఓ చిత్రం చేయబోతున్నట్లు చెప్పారు. అప్పలరాజు ప్లాప్ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ తన వద్ద రకరకాల సబ్జెక్టులతో సినిమాలు చేసేందుకు స్క్రిప్టులు రెడీ గా ఉన్నాయని, అందులో ఒకటి వివాహ వ్యవస్ధపైన అని అన్నారు. ఇక అప్పలరాజు చిత్రానికి సీక్వెల్ చేయటం ఖాయమని చెప్పుకొచ్చారు. అలాగే తన తాజా చిత్రం దొంగల ముఠా ..మార్చి 18 న విడుదల చేయటానికి రెడీ అవుతోందని అన్నారు.
అలాగే దొంగల ముఠా చిత్రం తక్కువ రోజుల్లో తీసారు కదా..ఎలా సాధ్యమైంది అన్నదానికి సమాధానంగా...తక్కువ, ఎక్కువ అనేది తీస్తున్నదానిపై దర్శకుడికి ఉండే అవగాహనపై ఆధారపడి ఉంటుంది. ఇంగ్లీషులో 'గ్లాడియేటర్' సినిమాను 45రోజుల్లో తీశారు. నాకు తెలిసి కెమెరామెన్ సరిగ్గా తీయలేకపోతే సినిమా ఆలస్యమవుతుంది. లేదంటే స్క్రిప్ట్ రెడీకాక పోవటం. నటీనటుల వల్ల ఆలస్యమనేది ఎప్పుడూ ఉండదు అన్నారు. 'దొంగల ముఠా' చిత్రం షూటింగ్ మొదటే చెప్పినట్లుగా కేవలం ఐదు రోజుల్లో ,కేవలం ఎనిమిది మంది క్రూ మెంబర్స్ తో దిగ్విజయంగా పూర్తి చేసారు.